S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/04/2017 - 03:39

ఖమ్మం, డిసెంబర్ 3: వివాదాస్పద రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్యను ఖమ్మం పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలో జరుగుతున్న గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు ఆదివారం రాత్రే ఐలయ్య ఖమ్మం చేరుకున్నారు. ఈ మహాసభకు అనుమతి ఉన్నప్పటికీ పాల్గొనేందుకు ఐలయ్యకు అనుమతి లేదని పోలీసులు ముందునుంచే చెపుతూ వచ్చారు.

12/04/2017 - 03:27

తిరుపతి, డిసెంబర్ 3: తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో టీటీడీ సాధారణ ధరకు విక్రయిస్తున్న లడ్డూలు అదనంగా కావాలని నిర్వాహకులు భావిస్తే, అందుకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు.

12/04/2017 - 03:15

హైదరాబాద్, డిసెంబర్ 3: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాలను వచ్చే వేసవి వరకు పొదుపుగా ఉపయోగించుకోవాలన్న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాను బేఖాతరు చేస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ ఆంధ్ర, పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని మళ్లిస్తోందని ఆంధ్ర రాష్ట్రంపైన తెలంగాణ రాష్ట్రం పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.

12/04/2017 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 3: ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టుకు బస్సు యాత్ర చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చేతులెత్తేస్తూ దానికి శాశ్వతంగా సమాధి కట్టేలా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఈ దుర్మార్గ వైఖరిని ప్రజలకు వెల్లడించేందుకు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ తెలిపింది.

12/04/2017 - 02:08

హైదరాబాద్, డిసెంబర్ 3: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్రం తరపున కేంద్రాన్ని కోరనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఈ అంశంపై కేంద్రంపై వత్తిడి తీసుకరావడానికి రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రిని కలుస్తామన్నారు.

12/04/2017 - 02:03

హైదరాబాద్, డిసెంబర్ 3: ‘కొలువుల కొట్లాట’ పేరిట టి.జెఎసి సోమవారం (4న) సభ నిర్వహించనుండగా, ఆదివారం మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలోనే మానేరు వసతి గృహంలో విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకోవడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. మురళి ఆత్మహత్యకు సరైన కారణాలు ఏవీ తెలియకపోయినప్పటికీ, నిరుద్యోగ సమస్యతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని సహచర విద్యార్థులు ఆందోళనకు దిగారు. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.

12/04/2017 - 02:10

హైదరాబాద్, డిసెంబర్ 3: ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓయూలోని మానేరు హాస్టల్‌లో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థి మురళి ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌కు చెందిన మురళి మానేరు హాస్టల్ రూమ్ నెం.159లో ఉంటూ చదువుకుంటున్నాడు.

12/04/2017 - 01:45

హైదరాబాద్, డిసెంబర్ 3: వివాహిత మహిళలు, యువతుల అమాయకత్వం వారి మాన ప్రాణాలపైకి వస్తోంది. అయిన వాళ్లంటూ చేరదీసి అత్యాచారానికి ఒడిగడుతున్నారు. నమ్ముకొని ఆశ్రయిస్తే.. అయినవాళ్లే కాటేస్తున్నారు.. రేపిస్టులంతా తెలిసినవారే కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. మహిళలు తెలిసిన వాళ్లని, కుటుంబ మిత్రులని, స్నేహంగా ఉన్నారని చనువిచ్చారో..లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురికాక తప్పడం లేదు.

12/04/2017 - 01:43

ఆదోని, డిసెంబర్ 3 : రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతో మభ్యపెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైకాపా అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని 3 దశల్లో చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం జగన్ ఆదోని డివిజన్‌లోని జి.ఎర్రగుడి గ్రామంలో నిర్వహించిన రైతు ఆత్మీయసభలో పాల్గొన్నారు.

12/04/2017 - 01:40

విజయవాడ, డిసెంబర్ 3: పోలవరం ప్రాజెక్టు టెండర్లు, సబ్ కాంట్రాక్టుల ప్రహసనంపై కేంద్రం విచారణ జరిపిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలంతా జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పోలవరంపై ఆయన విలేఖరులతో మాట్లాడారు.

Pages