S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/02/2017 - 02:42

తిరుపతి, డిసెంబర్ 1: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి 2018 మార్చి నెల కోటాలో 53,428 టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ ఈ ఓ ఎకె సింఘాల్ తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈ ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుంచి ఈ టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్‌లైన్లో డిప్ ద్వారా 10,843 టికెట్లు విడుదల చేశామన్నారు.

12/02/2017 - 02:41

తిరుపతి, డిసెంబర్ 1: ఆన్‌లైన్ డిప్ విధానంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అందిస్తున్న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు పొందడం కష్టంగా ఉందని పలువురు భక్తులు ఈ ఓకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈ ఓ కార్యక్రమానికి 23 మంది భక్తులు వివిధ రకాల ప్రశ్నలు, సమస్యలు,సలహాలను ఈఓకు తెలియజేశారు.

12/02/2017 - 01:52

నిజామాబాద్, డిసెంబర్ 1: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లా అభంగపట్నం ఉదంతానికి సంబంధించిన కేసులో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. గడిచిన మూడువారాల నుండి నిరవధికంగా కొనసాగుతున్న దళిత సంఘాల నిరసనల పర్వానికి శుక్రవారం నాటి తాజా పరిణామంతో బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

12/02/2017 - 01:40

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: పోలవరం టెండర్ల వ్యవహారంలో కేంద్రం రాసిన లేఖ దుమారం రేపడంతో కుడి, ఎడమ గట్లపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలే శరణ్యమన్న భావన బలపడుతోంది. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరిస్తామని, 2019కి ప్రాజెక్టు పూర్తిచేస్తామని ఇప్పటివరకు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణలో కష్టసాధ్యమన్న వాదన బలపడుతోంది.

12/02/2017 - 01:38

హైదరాబాద్, డిసెంబర్ 1: కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి బోర్డు ఆదేశాలు, సలహాలు, సూచనలను ఆంధ్ర, తెలంగాణలు తుచ తప్పకుండా పాటించాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఉభయ రాష్ట్రాలకు శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుందూ లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరారు.

12/02/2017 - 01:34

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన రవాణా శాఖ అధికారిని అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో పని చేస్తున్న పరిపాలనాధికారి పి.రవీందర్ నివాసంపైనా, ఆయనకు సంబంధించిన ఇతర నివాసాలు, ప్రాంతాల్లో మూకుమ్మడి సోదాలు నిర్వహించి దాదాపు ఆరు కోట్ల విలువైన ఆస్తులున్నట్లు గురించారు.

12/02/2017 - 01:31

అమరావతి, డిసెంబర్ 1: కాపుల చిరకాల స్వప్నం బీసీ హోదా సాకారంకానుంది. ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీకి కేంద్రం ఆమోదం లభిస్తే చట్టరూపం దాల్చనుంది. బీసీ కమిషన్ సిఫార్సు మేరకు కాపులను బీసీల్లో చేర్చుతూ మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం ద్వారా సిఎం చంద్రబాబు కాపుల పెదవులపై చిరునవ్వులు పూయించారు.

12/02/2017 - 00:13

హైదరాబాద్, డిసెంబర్ 1: మహిళలపై జరిగిన వివిధ నేరాల్లో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉండగా, తెలంగాణ 4వ స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకటించింది. 2016లో వివిధ రాష్ట్రాల్లో మహిళలపై నేరాల గణాంక వివరాలను ఎన్‌సిఆర్‌బి వెల్లడించింద. తెలంగాణలో 2015తో పోల్చితే 2016లో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టగా, ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు పెరిగాయి.

12/01/2017 - 04:35

హైదరాబాద్, నవంబర్ 30: ప్రపంచ పారిశ్రామిక సదస్సుతో పాటు మెట్రోరైలు ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలు దిగ్విజయం కావడంతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతోషం, సంతృప్తిని వ్యక్తం చేసారు.

12/01/2017 - 02:46

హైదరాబాద్, నవంబర్ 30: విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోని పక్షంలో, ఆ తర్వాత తాము చెప్పేది వినాల్సి వస్తుందని ఉమ్మడి హైకోర్టు ఉభయ తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. 1200 మంది విద్యుత్ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

Pages