S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

,
03/17/2020 - 01:35

హైదరాబాద్/సికిందరాబాద్, మార్చి 16: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నాలుగుకి చేరింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెంది న ఓ మహిళ, ఇటలీ స్కాట్‌లాండ్‌కు చెందిన ఇద్దరు ఉండగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరొకరు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. తాజాగా సోమవారం మరో 22 మంది అనుమానితులను గాంధీ ఆసుపత్రిలో చేర్చుకున్నారు.

03/17/2020 - 01:05

సింహాచలం, మార్చి 16: ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ నుండి మానవాళిని రక్షించుకునేందుకు ప్రభుత్వాలు విశ్వప్రయత్నా లు చేస్తున్నా యి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందిని పొట్టన పెట్టుకొని, లక్షలాది మందిని అనారోగ్యానికి గురిచేసిన కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల

03/16/2020 - 06:12

ఖమ్మం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నీడలు జగదభిరాముని కల్యాణ వేడుకలపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

03/16/2020 - 06:33

రాజమహేంద్రవరం, మార్చి 15: తెలుగు భాషా పరిరక్షణకు మేధావులు, భాషాభిమానులు జరిపే ఉద్యమానికి తను గొంతునవుతానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమానికి వేదికనవుతానన్నారు.

03/16/2020 - 04:28

హైదరాబాద్: రాష్ట్ర విభజనతో విద్యుత్ ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం మళ్లీ రాజుకుంటోంది. విద్యుద్ ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి నియమించిన ఏకసభ్య కమిటీ చైర్మన్ ధర్మాధికారి తీర్పుతో ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న 655 మంది విద్యుత్ ఉద్యోగులను మళ్లీ తెలంగాణకు రిలీవ్ చేయడాన్ని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

03/15/2020 - 05:12

హైదరాబాద్: పర్యావరణాన్ని విధ్వంసం చేయడం వల్ల మానవాళికి హాని జరుగుతుందని, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని జాతీయ జీవ వైవిధ్య సంస్థ చైర్‌పర్సన్ డాక్టర్ వీబీ మాథూర్ అన్నారు. శనివారం ఇక్కడ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జీవవైవిధ్యంపై జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు.

03/15/2020 - 01:22

తిరుపతి, మార్చి 14: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బ శ్రీవారి దర్శనంపై పడింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించాలనుకున్న కల్యాణాన్ని ఆలయం వెలుపల నిర్వహించకూడదని నిర్ణయించారు. పెద్దఎత్తున భక్తులు చేరితే ఎక్కడ కరోనా వ్యాప్తిచెందుతోందన్న ఆందోళనతోనే టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

03/13/2020 - 06:09

వేములవాడ: తెలంగాణ మాగాణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో భక్తజన రంజకమై, భూకైలాసమై వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల దివ్యకల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తాన గురువారం ఉదయం 10.50 గంటలకు కల్యాణతంతును ఆలయ అర్చకులు ప్రారంభించారు.

03/13/2020 - 02:09

విజయవాడ, మార్చి 12: బయోమెట్రిక్ హాజరుపై పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో మున్సిపల్ ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ ఫిజికల్ విధానంలో హాజరు నమోదు చేయాలని ఆదేశించింది.

03/11/2020 - 07:10

తిరుపతి: రానున్న వేసవిలో గతంలో కన్నా మూడు నుంచి నాలుగు శాతం మంది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని అంచనావేసి అందుకు తగిన విధంగా దర్శన, వసతి, ప్రసాదాల తయారీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, వేసవి ఉష్ణతాపంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.

Pages