S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/28/2018 - 02:45

హైదరాబాద్ జూన్ 27: ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ హౌసింగ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా సహకార సొసైటీ (డిసిఓ), సహకార జాయింట్ రిజిష్టర్‌ను ఆదేశిస్తూ తక్షణం ఏపీ ఎన్జీఓ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ సొసైటీపై తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పీళ్లనన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది.

06/28/2018 - 05:16

హైదరాబాద్, జూన్ 27: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. డీఎస్‌పై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధం చేసాకే, ఆయనపై నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదు తెప్పించుకున్నట్టు ఈ వర్గాల సమాచారం.

06/28/2018 - 02:28

నిజామాబాద్, జూన్ 27: తాను పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు జిల్లాకు చెందిన తెరాస ప్రజాప్రతినిధులు ఆరోపించడంలో ఎలాంటి వాస్తవం లేదని తెరాస నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ స్పష్టం చేశారు. డీఎస్ వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా నేతలంతా అధిష్ఠానానికి లేఖ రాసిన విషయంపై మీడియా డీఎస్‌ను వివరణ కోరగా, ఆయన పైవిధంగా స్పందించారు.

06/28/2018 - 05:18

అమరావతి, జూన్ 27: జాతీయ స్థాయిలో రాష్ట్ర పంచాయతీరాజ్..గ్రామీణాభివృద్ధిశాఖ..ఐటీ విభాగాలు అమలు చేస్తున్న కార్యక్రమాలకు మరోసారి అవార్డులు దక్కటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి, పారిశుద్ధ్యం తదితర అంశాలలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 22 స్కోచ్ అవార్డులు లభించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

06/28/2018 - 05:21

విశాఖపట్నం, జూన్ 27: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత పోరాట యాత్ర గురువారం నుంచి విశాఖ జిల్లాలో ప్రారంభం కానుంది. గత నెల 20న శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాట యాత్ర ప్రారంభించిన పవన్ కొన్ని కారణాల వలన యాత్రను వాయిదా వేశారు. సుదీర్ఘ విరామం తరువాత గురువారం ఈ యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నారు. పవన్ యాత్రకు విరామం ప్రకటించిన ఈ సమయంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు ఊపిరి పోసుకున్నాయి.

06/28/2018 - 05:23

హైదరాబాద్, జూన్ 27: దేశంలో ఉన్నత విద్యారంగంలో పెను సంచలనాలకు కేంద్రప్రభుత్వం తెరతీసింది. ఉన్నత విద్యాసంస్థలకు నిధుల జారీ, గుర్తిం, పర్యవేక్షణ, తనిఖీల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని రద్దు చేసింది. దాని స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్ (హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా/ హెచ్‌ఇసిఐ)కు రూపకల్పన చేసింది.

06/27/2018 - 13:50

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 20వేల సీసీ కెమెరాలు పెట్టబోతున్నామని తెలిపారు. టెక్నాలజీ వినియోగిస్తే పోలీసింగ్‌ సులువు అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2017 బ్యాచ్‌ ట్రైనీ ఎస్‌ఐలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అలిపిరిలో తనపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావించారు. దాడి ఎందుకు జరిగిందో ఎస్సైలకు సీఎం వివరించారు.

06/27/2018 - 13:15

లింగాల ఘనపూర్: జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో కెనరా బ్యాంకులో అటెండర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కెనరా బ్యాంక్ అటెండర్ జయపాల్‌ ఖాతాదారులను ఏమార్చి వారి ఏటీఎం కార్డుల ద్వారా సుమారు రూ.10లక్షల నగదు డ్రా చేశాడు. ఖాతాదారులకు డమ్మీ ఏటీఎం కార్డులు ఇచ్చి ఒరిజినల్ కార్డులు అతని దగ్గర ఉంచుకొని పిన్ నెంబర్ తెలుసుకొని డబ్బులు డ్రా చేసినట్లు తెలుస్తోంది.

06/27/2018 - 04:18

విశాఖపట్నం, జూన్ 26: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాతో ప్రమేయం ఉన్న స్మగ్లర్ల మూలాలు శోధించి వారి ఆటకట్టించే విధంగా ముందుకు సాగుతున్నామని సీఐడీ అదనపుడీజీ ఆమిత్ గార్గ్ వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో భాగంగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్మగ్లర్ల ఆచూకీ కోసం ఆయా రాష్ట్ర పోలీసు యంత్రాంగంతో చర్చిస్తున్నామన్నారు.

06/27/2018 - 04:03

విజయవాడ, జూన్ 26: ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2.58 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకూ ప్రస్తుత సీజన్‌లో సాధారణం కంటే 15.4 శాతం మేర వర్షపాతం తక్కువగా నమోదైందని తెలిపారు.

Pages