S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/18/2018 - 00:57

ఒంగోలు, ఫిబ్రవరి 17: మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, అన్నిపంటలకు గిట్టుబాటు కల్పిస్తామని అందుకోసం మూడువేల కోట్లరూపాయలతో ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 90వ రోజు శనివారం ఉదయం ఎనిమిదిగంటలకు బంగారక్కపాలెంక్రాస్ నుండి ప్రారంభమైంది. అనంతరం వలేటివారిపాలెం చేరుకుంది.

02/18/2018 - 03:42

హైదరాబాద్: కాంగ్రెస్ పార్ట ఈ నెల 26 మొదటి విడత బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించింది. శనివారం గాంధీ భవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పిసిసి ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు.

02/18/2018 - 00:45

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చేసే హెచ్చరికలను లెక్క చేసేది లేదని, అలాంటి బెదిరింపులకు లొంగేది లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణకు తాము సహకరించబోమని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కడియం శ్రీహరి శనివారం నాడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

02/18/2018 - 03:44

హైదరాబాద్: దేశంలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలు రాబోతున్నాయని, దీనికి తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు సంస్థాగతంగా సంసిద్ధం కావాలని దక్షిణాది విద్యుత్ సంస్థల సంఘం అధ్యక్షుడు, తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. పాండిచ్చేరిలో 33వ దక్షిణాది విద్యుత్ సంస్థల సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు.

02/18/2018 - 00:25

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధినొందిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం కనుల పండువగా మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహాచార్యులు తదితరులు

02/18/2018 - 00:23

కాకినాడ, ఫిబ్రవరి 17: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని పైడిపాల అగ్రహారం గ్రామంలో భారీ భూకుంభకోణం వెలుగుచూసింది. గ్రామంలోని సర్వే నంబర్ 33లో శ్రీరామచంద్రప్రభు ఉత్తరాది మఠానికి చెందిన భూములపై కబ్జాదారుల కన్ను పడింది. అంతే రెవెన్యూ అధికారులకు లక్షలు ముట్టజెప్పి కోట్ల విలువైన సుమారు 86 ఎకరాల భూములను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆన్‌లైన్‌లో తమ పేరున నమోదు చేయించుకున్నారు.

02/18/2018 - 00:11

గుంటూరు/ నరసరావుపేట, ఫిబ్రవరి 17: త్వరలో నాగార్జునసాగర్ కుడికాలువకు గోదావరి జలాలను తీసుకువచ్చి ఆయకట్టును పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగర్ కుడికాల్వకు నీటిని తరలించి సాగుకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూస్తామన్నారు. భవిష్యత్తులో ఏపీని నాలెడ్జి, ఎడ్యుకేషన్ హబ్‌గా మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

02/17/2018 - 18:08

హైదరాబాద్: టీడీపీ-వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. జేఎఫ్‌సీ విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారానికి చర్చలు ముఖ్యమని, ప్రజాస్వామ్యంలో సమాచారాన్ని ప్రజలకు ఇవ్వటం ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

02/17/2018 - 17:18

గుంటూరు: విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలి. దక్షిణాది రాష్టాలతో సమానంగా అభివృద్ధి అయ్యే వరకు సహకరించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన స్పందన రాలేదని, అయినా ఇప్పటికీ న్యాయం జరుగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో పెట్టిన చివరి బడ్జెట్‌లో కూడా ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.

02/17/2018 - 16:41

గుంటూరు:విద్యారంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చామని, 20 ఏళ్ల క్రితమే ఐటీకి ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు చెప్పారు. నరసరావుపేట మండలం కాకానిలో జేఎన్టీయూ భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలని, మొక్కుబడి చదువులు వద్దని సూచించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Pages