S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/19/2018 - 04:33

మిర్యాలగూడ టౌన్, మే 18: తెలంగాణలో టీడీపీని కొంతమంది నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, అయినా మినీమహానాడులు మాత్రం చెక్కు చెదరలేదని నిరూపిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు.

05/19/2018 - 04:28

సూర్యాపేట రూరల్, మే 18: అధికారంలో ఉన్న సమయంలో రైతుల సమస్యలు పట్టించుకోకుండా నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుంటే దిగజారి విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కర్రుకాల్చి వాతలు పెట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

05/19/2018 - 04:27

లక్సెట్టిపేట, మే 18: రైతులను గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు అన్ని రంగాల్లో చిన్నచూపు చూడటంతో వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య పాల్పడవద్దనే సదుద్దేశంతో ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుంచి రైతులను కన్న బిడ్డలా చూసుకుంటున్నారని మంత్రి జోగు రామన్న అన్నారు.

05/19/2018 - 03:28

హైదరాబాద్, మే 18: కర్నాటకలో బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తూ లేఖ పంపించారు. హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.

05/19/2018 - 03:24

హైదరాబాద్, మే 18: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం వంటి కార్యక్రమాలపై ప్రజలకు చేరువుకావడానికి సింగరేణి సంస్థ వినూత్న పద్దతిలో పాటలతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సంస్థ ముఖ్య పౌరసంబంధాల అధికారి జనగాం నాగయ్య తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవనంలో పాటల సిడీలను ఆయన ఆవిష్కరించారు.

05/19/2018 - 01:02

హైదరాబాద్, మే 18: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు అవసరమైన బిసి లెక్కలను గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే గణనను పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సిఎం కెసిఆర్‌ను కోరారు. కొత్తగా ఇంటింటికీ తిరిగి బిసి జనాభా లెక్కలు సేకరించడం సరికాదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు.

05/19/2018 - 01:01

హైదరాబాద్, మే 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌భగీరత పథకాన్ని యుద్ధప్రాతిపధికన పూర్తి చేసి, గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో మంచినీటి సౌక్యం కల్పించాలని గ్రామీణ మంచినీటి సరఫరా పథకం ఇంజనీరింగ్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. శుక్రవారం నాడు సచివాలయంలో మిషన్‌భగీరత పనుల తీరుపై జిల్లాల ఎస్‌ఇ,సిఈలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

05/19/2018 - 01:01

హైదరాబాద్, మే 18: కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకీ మెజారిటీ సంపూర్ణమైన రాకపోవడంతో గంట, గంటకూ మారుతున్న రాజకీయాలతో ఉత్కంఠ నెలకొంటున్నది. అయితే శనివారం బలనిరూపణ చేసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించడంతో ఆ రాష్ట్ర గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను నియమించారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని జెడిఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు.

05/19/2018 - 01:00

హైదరాబాద్, మే 18: రెండేళ్ల డిప్లొమో ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డిపిఎస్‌ఇ) కోర్సులో చేరేందుకు జూన్ 1 వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అభ్యర్ధులకు ఈసారి దీనిని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. మైనార్టీ, నాన్‌మైనార్టీ అభ్యర్ధులు సైతం ప్రవేశపరీక్షకు హాజరు కావాలని సూచించారు.

05/19/2018 - 00:59

హైదరాబాద్, మే 18: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు పదోన్నతులకు మూడేళ్ల సర్వీసు ఉండాలన్న నిబంధనను తొలగిస్తూ సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది. ఇక మీదట పదోన్నతులకు రెండు సంవత్సరాల సర్వీ సు ఉంటే సరిపోతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఉత్తర్వులు జారీ చేసారు.

Pages