-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ప్రత్యేక విమానంలో మహారాష్టల్రోని షిర్డీకి వెళ్లారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20: నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వమని, పేదల కష్టాలు చూసి చలించిన మోదీ దేశవ్యాప్తంగా 8 కోట్ల పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. తన తల్లి వంటింట్లో పడ్డ కష్టాలు చూసిన మోదీ , ఏ తల్లీ అలాంటి కష్టాలు పడకూడదనే ఉద్దేశ్యంతో ఉచిత గ్యాస్ ఇస్తున్నారని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇఎన్సీ రవీందర్ రావు, సిఇలు ఆశారాణి, సతీష్ ఇతర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20: తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పుట్టిన రోజు వేడుకను జరుపుకోకుండా ప్రజల కోసం ధర్మపోరాట దీక్ష చేశారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. చంద్రబాబు 69వ జన్మదినోత్సవం సందర్భంగా రమణ ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20: నిలువ నీరు, బురద లేకుండా మెట్ట భూముల్లో మొక్కజొన్న పంట లాంటి వరి సాగు పద్ధతిలోని ఏరోబిక్ రైస్ పంట వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని ఈ పంటపైన పరిశోధనలు చేసిన కిసాన్ క్రాఫ్ట్కు చెందిన సుమంతా హోలా, సౌజన్య తెలిపారు. ఏరోబిక్ రైస్ పర్యావరణ అనుకూల బియ్యమని, ఈ వరి ఉత్పత్తి పద్ధతిలో మిథేన్ ఉద్గారం గణనీయంగా తగ్గుతుందన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణలో ఎడ్సెట్, పీఈసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. బీఈడీలో చేరేందుకు నిర్వహించే ఎడ్సెట్ దరఖాస్తు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ గడువు పొడిగించారు. 25వ తేదీ తర్వాత 500 జరిమానాతో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని కన్వీనర్ ప్రొఫెసర్ సి మధుమతి తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20: సగర కులానికి చెందిన వారి హక్కుల కోసం పోరాటం చేసేందుకు ఈ నెల 22న ‘సగర శంఖారావం’ పూరించనున్నట్లు సగర హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీరడి భూపేష్ సాగర్ తెలిపారు. సగర హక్కుల పోరాట సమితి నాయకులు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో సమావేశమయ్యారు.
ఇందూర్, ఏప్రిల్ 20: నిజామాబాద్ జిల్లా కేం ద్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారుడు మహ్మద్ హుస్సాముద్దీన్ను శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఎం.పీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హుస్సాముద్దీన్ ఇటీవల జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో రాణించి కాంస్య పతకాన్ని సాధించిన విష యం విదితమే. ఈ సందర్భంగా ఎం.పీ కవిత ఆయనను ప్రశంసిస్తూ, జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారని కొనియాడారు.
వరంగల్ రూరల్జిల్లా, ఏప్రిల్ 20: రైతులు పండించిన పంటను మద్య దళారులకు అమ్ముకుని మోస పోవద్దనే ఉద్ధేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెరుకవేడు, మండల కేంద్రంలోని వ్వయసాయ మార్కెట్ అవరణలో ఐకేపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19: గత ఏడాది నియమితులైన 309 మంది పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గురువారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్లో శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి కృష్ణప్రసాద్ ట్రోఫీలను అందజేశారు..