S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

07/27/2016 - 21:08

దేశంలో ప్రస్తుతం స్వతంత్ర పోలీస్ విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాజ్యాంగపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది. అయితే ఇప్పుడు రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సిబిఐ)ని ఉపయోగించుకుంటోంది.

07/27/2016 - 21:07

టెర్రరిజానికి కులం లేదు, మతం లేదు, పైశాచికత్వమే వారి అభిమతం. కాబట్టి ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు అన్ని పార్టీలూ రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. ఉగ్రవాదుల దాడుల్లో, మారణ హోమంలో మా పార్టీ భారీగా నష్టపోయింది. ఉక్కు మనిషి ఇందిరా గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.

07/27/2016 - 21:06

భారతదేశానికి ఉగ్రవాదం కొత్తకాదు. వెయ్యి సంవత్సరాలుగా ఉగ్రవాద దాడులకు భారత్ తల్లడిల్లుతోంది. ఉగ్రవాదం గురించి మాట్లాడే ముందు దాని మూలాల్లోకి వెళ్లాలి. మా దేశంలో ఉగ్రవాదం లేదు అని చెప్పుకునే ఐరోపా, అమెరికా దేశాలు ఈ రోజు ఉగ్రవాద పెనుభూతం తాకిడికి అల్లాడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ సమస్యగా ఎదిగింది. ఉగ్రవాదం ఎక్కడ పుట్టింది.. ఎవరు పుట్టించారనేది అనే్వషిస్తే.. బిన్ లాడెన్ అయినా..

07/27/2016 - 21:05

ప్రస్తుతం దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న మారణహోమం మొత్తానికి తీవ్రవాదం, ఉగ్రవాదం కారణమని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఉగ్రవాదం, తీవ్రవాదం ముసుగులో అమాయకులైన పౌరులను పోలీసులు అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా సంబంధంలేని వారిని ఈ కేసులలో ఇరికిస్తున్నారు. మత, వామపక్ష తీవ్రవాదం ఏ వాదమైనా సరే హింసను అందరు ఖండించాల్సిందే.

07/20/2016 - 21:50

గవర్నర్ల అధికారాలు, పరిధి, విస్తృతి అంశాలపై మరోమారు చర్చ మొదలైంది. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత కాగా, గవర్నర్ రాష్ట్ధ్రానేతగా వ్యవహరిస్తారు. వాస్తవానికి గవర్నర్ పదవి నామకార్థమైనదే, భారత రాష్టప్రతికి ప్రతినిధిగా రాష్ట్రాలకు గవర్నర్లు వ్యవహరిస్తారు. ఐదేళ్ల పదవీకాలానికి గవర్నర్లను రాష్టప్రతి నియమిస్తారు.

07/20/2016 - 21:49

సంక్లిష్ట సమయంలో గవర్నర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర కీలకం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో, ఏ పార్టీకి మెజారిటీ రాని సమయంలో గవర్నర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. దీనికే గవర్నర్లు పరిమితం కారాదు. మిగిలిన సమయంలో విద్యా రంగంలో, కళా సాంస్కృతిక రంగాల్లో గవర్నర్లు కృషి చేయవచ్చు. అలా చేసి ఆదర్శంగా నిలిచిన గవర్నర్లు ఎంతో మంది ఉన్నారు.

07/20/2016 - 21:48

భారతదేశంలో ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో కీలకమైన గవర్నర్‌ల వ్యవస్థ నిర్వీర్యమవుతున్నదా అనే అనుమానం కలుగుతోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టటం, జరిగిన అనైతికతను సరిదిద్దటం ఇందుకు ప్రబల నిదర్శనంగా పేర్కొనవచ్చు.

07/20/2016 - 21:47

గవర్నర్ల వ్యవస్థ కచ్చితంగా ఉండాలి. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనుసంధానం ఉండాలి. మనది సమాఖ్య తరహా వ్యవస్థ. ఏ సంఘటన జరిగినా ఒకవేళ ప్రభుత్వ నియంత్రణ తప్పినప్పుడు తప్పనిసరిగా గవర్నర్ రంగంలోకి వస్తారు. ఆంధ్ర, తెలంగాణ గవర్నర్‌ను చూడండి. ఇరువురు సిఎంలు కలుస్తున్నారు. సమస్యలను విన్నవిస్తున్నారు. పరిష్కారం సంగతి సరే.

07/20/2016 - 21:43

రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రాజ్యాంగం గవర్నర్‌కు అధికారాలు కల్పించినప్పటికీ, అవి నామమాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులు (జిఓలు) గవర్నర్ పేరుతో విడుదల అవుతున్నప్పటికీ, వాటితో గవర్నర్‌కు ఎలాంటి సంబంధం ఉండటం లేదు. ఏ జీఓలో ఏముందో, ఏ జీఓ ఎందుకు వెలువరిస్తున్నారో గవర్నర్ ముందస్తు అనుమతి ఏమీ తీసుకోరు.

07/20/2016 - 21:40

వివిధ సందర్భాల్లో గవర్నర్ల పాత్ర చాలా వివాదస్పదమవుతోంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర ఎలా ఉండాలి.. వారికి ఉండే విధులు, అధికారాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కొన్ని సందర్భాల్లో గవర్నర్లు తమ పరిధిని దాటి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వాలు పడిపోవడానికీ కారణమవుతున్నారు. ఇది దురదృష్టకరం. గవర్నర్ల ప్రమేయంతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నది.

Pages