-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల, ఆగస్టు 21: వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామన్న జగన్ మాటలు నంద్యాల ప్రజలే కాదు, రాష్ట్రంలోని వైశ్యులెవరూ నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. ఆయన నంద్యాలలో మాట్లాడుతూ, అసలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేని జగన్ కార్పొరేషన్ ఎలా స్థాపిస్తారని ప్రశ్నించారు.
కాకినాడ, ఆగస్టు 21: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వస్థలం ఇడుపులపాయలోని బంకర్లను తవ్వితే వేల కోట్ల అవినీతి సొమ్ము బయటపడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఇడుపులపాయలోని బంకర్లలో జగన్ దాచిన అవినీతి సొమ్మును అధికారులు వెలికితీయాలని, లేదంటే తమను వెళ్ళి బంకర్లు తెరవమంటే తెరిచి చూపిస్తామన్నారు.
తిరుపతి, ఆగస్టు 21: స్థానిక యానాదికాలనీలో ఏడు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను కూలగొట్టి, అక్కడి నివసిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం, నగరపాలక సంస్థ అధికారులు అనుసరిస్తున్న తీరు అమానుషమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదలైంది.
చింతూరు, ఆగస్టు 21: అంబులెన్సు, మరో వాహనంలో తరలిస్తున్న 610 కిలోల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా చింతూరు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఒడిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
హైదరాబాద్, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా కారం శివాజీ నియామకంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. కారం శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్పై జస్టిస్ చల్లా కోదండరాం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. వైజాగ్కు చెందిన కె రాజారావు దాఖలు చేసిన ప్రజావాజ్య పిటీషన్ను విచారించిన న్యాయమూర్తి ఈ విషయంలో ప్రభుత్వం తన వాదన వినిపించాలని ఆదేశించారు.
విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 21: విశాఖ జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ఎలియాస్ కన్నబాబుపై అప్పు తీసుకుని చెల్లించనందుకు పోలీసు కేసు నమోదైంది. రూ.50 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేసిన రమణమూర్తిరాజుపై విశాఖలోని ద్వారకా పోలీసు స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వారకానగర్లో నివాసముంటున్న రాజన్నబాబు సరోజినీ ఇంజనీరింగ్ వర్క్స్ నడుపుతున్నారు.
తిరుపతి, ఆగస్టు 21: టిటిడి కార్యనిర్వహణాధికారిగా అనేక సంస్కరణలు చేపట్టి ఇటు భక్తులకు, ఉద్యోగులకు, స్థానికులకు గొప్ప సౌకర్యాలు కల్పించిన ఘనత పివిఆర్కె ప్రసాద్కే దక్కుతుందని ఇఓ ఎకె సింఘాల్ ఘన నివాళి అర్పించారు. సోమవారం స్థానిక అన్నమయ్య భవన్లో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ముందుగా పివిఆర్కె మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి, ఆగస్టు 21: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రమైంది. సోమవారం అమావాస్య, సూర్యగ్రహణం, శ్రావణమాసం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక క్యూలు, సాధారణ క్యూలు నిండిపోయాయి. స్వామి, అమ్మవార్ల దర్శనానికి 5 గంటలకుపైగా సమయం పట్టింది. రాహు-కేతు పూజలకు కూడా రద్దీ ఏర్పడింది. సాయంత్రం 5 గంటలకే 5000 వేల మందికి పైగా పూజలు చేయించుకున్నారు.
ప్రత్తిపాడు, ఆగస్టు 21: చలో అమరావతి పాదయాత్రకు పోలీసులు అడ్డుతొలగే వరకు చలో కిర్లంపూడి కార్యక్రమాన్ని కొనసాగించాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కోరారు. కాపులను బిసిల్లో చేర్చాలని తలపెట్టిన పాదయాత్రను 27వ రోజు సోమవారం కూడా పోలీసులు అడ్డుకున్నారు. వారు అడ్డుకున్న చోటే జెఎసి సభ్యులతో కలిసి ముద్రగత బైఠాయించారు.
రాజమహేంద్రవరం, ఆగస్టు 20: ఇసుక మాఫియా గోదావరి నదికి తూట్లు పెడుతోంది. ఎక్కడబడితే అక్కడ యంత్రాలతో విచక్షణారహితంగా తవ్వేస్తుండటంతో నది గర్భశోకంతో విలవిల్లాడుతోంది. ఇసుక దిబ్బల్లో మాఫియా భారీస్థాయిలో చెరువుల మాదిరిగా తవ్వకాలు సాగించడంవల్ల నదీ గమన దిశలు మారిపోయే స్థితిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.