S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/18/2018 - 23:35

విజయవాడ (క్రైమ్), మే 18: రాష్ట్రంలో నిత్యం ఏదోఒకచోట బాలికలపై, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖ పోక్సో కేసుల దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ ఎం.మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

05/18/2018 - 23:34

విజయవాడ, మే 18: రాష్ట్రంలో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యువల్ మిషన్‌లో భాగంగా బీఎస్‌యూపీ, ఐహెచ్‌ఎస్డీపీ ప్రాజెక్టుల కింద మంజూరైన అర్బన్ హౌసింగ్ గృహాలన్నిటినీ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు.

05/18/2018 - 23:33

విజయవాడ, మే 18: పది లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు ప్రయోజనాలను చేకూర్చేలా ప్రభుత్వం 11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను నియమిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. దీనిపై ఏపీ జెఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

05/18/2018 - 23:32

రాజమహేంద్రవరం, మే 18: కాపులను బీసీల్లో చేర్చుతామని ప్రకటించే దమ్ము విపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఉందా అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేర్చుతానని చెప్పి పాదయాత్రలో ముందుకు నడవాలని జగన్‌కు సవాల్ చేస్తున్నానన్నారు.

05/18/2018 - 04:11

వలేటివారిపాలెం : పోలవరం రాష్ట్ర ప్రజల జీవనాడీ అని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టు కట్టి రైతులకు నీరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో పోకూరు గ్రామంలో నీరు- ప్రగతి కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబు మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.

05/18/2018 - 03:37

విజయవాడ, మే 17: ‘బ్లాక్‌మనీ, బ్లాక్ మెయిల్’ రాజకీయాలతో బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. కర్నాటకలో ఆ విధానాలనే అనుసరించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైందని, గవర్నర్ కూడా హైడ్రామా నడిపి బీజేపీకి కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం విజయవాడ దాసరి భవన్‌లో కత్తి నరసింహారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది.

05/18/2018 - 03:35

ప్రొద్దుటూరు, మే 17: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయాలని కోరుతూ కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంతలో ఓ రైతు శివాలయం గోపురంపైకి చేరుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు రంగంలోకి రైతును కిందికి దించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రైతులు పెద్దసంఖ్యలో ట్రాక్టర్లతో తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.

05/18/2018 - 03:32

విజయవాడ, మే 17: ప్రకాశం జిల్లా చీరాల వడ్డెర కాలనీకి చెందిన తిరుపతిరావు తన మేధాశక్తితో విద్యుత్ స్తంభాలను సులువుగా ఎక్కేందుకు వినూత్నంగా తయారుచేసిన పోల్ క్లైంబర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈనెల 11తేదీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్టప్రతి రాంనాధ్ కోవింద్ సమక్షంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జ్ఞాపిక, మూడు లక్షల నగదుతో తిరుపతిరావును సత్కరించారు.

05/18/2018 - 03:30

విజయవాడ, మే 17: రాష్ట్రంలోని లక్షా 84వేల మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పరిధిలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల గోడును ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవటం పట్ల వారిలో అసంతృప్తి పెరుగుతోంది. వేసవిలో సైతం వీరంతా సీపీఎస్ ఎంప్లారుూస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు దశల్లో పలు రకాల ఉద్యమాలు సాగిస్తూ వచ్చారు.

05/18/2018 - 03:29

విజయవాడ, మే 17: సులభం, వేగం అనే ప్రధాన నినాదంతో అమల్లోకి వచ్చిన మీ-సేవా కేంద్రాలు ఆచరణలో విఫలమవటంతో జనంలో నిరాసక్తత నెలకొంటోంది. ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండగా, అదే సమయంలో చేతి చమురు కూడా అధిక మొత్తంలో వదులుతోంది.

Pages