-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, నవంబర్ 24: వరుసగా ఏడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్లు సానుకూల పథంలోనే పయనించాయి. శుక్రవారం జరిగిన లావాదేవీల్లో మార్కెట్ దూకుడుకు ఐటి షేర్లు ఊతాన్నిచ్చాయి. లావాదేవీలు ముగిసే నాటికి బీఎస్ఈ సెనె్సక్స్ 91.16 పాయింట్లు (0.27 శాతం) పుంజుకుని 33,679.24 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 40.95 పాయింట్లు (0.40 శాతం) పుంజుకుని 10,389.70 పాయింట్ల వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, నవంబర్ 24: ఉల్లి ‘ఘాటు’తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇప్పుడు టమోటా ధరలు కూడా వెక్కిరిస్తున్నాయి. సరఫరాలు తగ్గడంతో ప్రస్తుతం న్యూఢిల్లీలో కిలో టమోటా ధర 80 రూపాయలకు పెరిగింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టమోటా ధరలు దాదాపు ఇదేవిధంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థల్లో ఒకటైన యమహా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ సరికొత్త వెర్షన్ ఎంటీ-09 సూపర్ బైక్ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ముంబయి, నవంబర్ 24: విదేశీ కరెన్సీ ఆస్తులు వృద్ధి చెందడంతో దేశంలో విదేశీ మారకద్రవ్య (్ఫరెక్స్) నిల్వలు ఈ నెల 17వ తేదీతో ముగిసిన వారంలో 240.4 మిలియన్ డాలర్లు పెరిగి 399.533 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శుక్రవారం వెల్లడించిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు వారంలో ఈ నిల్వలు 554.2 మిలియన్ డాలర్లు పెరిగి 399.293 డాలర్లకు చేరుకున్నాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 24: పొలారిస్ ఇండస్ట్రీస్ ఆధీనంలో పనిచేస్తున్న అమెరికన్ సూపర్ బైకుల తయారీ సంస్థ ఇండియన్ మోటార్సైకిల్ తమ స్కౌట్ బాబర్ మోడల్ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను 12.99 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ (ఆరు గేర్లు)తో కూడిన 1,133 సీసీ ఇంజన్తో ఈ బైకును తీర్చిదిద్దామని ఇండియన్ మోటార్సైకిల్ ఒక ప్రకనటలో వెల్లడించింది.
హైదరాబాద్, నవంబర్ 24: మేలైన పంటల విత్తనాలను ధృవీకరించి వాటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఐరోపా యూనియన్ తరహాలో పలు ఆసియా దేశాలతో విత్తన ఎగుమతి యూనియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. ఏకీకృత నియమాలతో ఒకే తరహా విత్తన ప్రయోగశాలను ఏర్పాటు చేసి అంతర్జాతీయ విత్తన పరీక్ష సమాఖ్య ప్రమాణాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలని కూడా సూచించినట్లు తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లిపాయల ధరలకు కళ్లెం వేసి, స్థానికంగా సరఫరాలను మెరుగుపర్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఉల్లిపాయల కనీస ఎగుమతి ధర (ఎంఇపి)ను టన్నుకు 850 డాలర్లుగా నిర్ణయించామని, కనుక దీనికంటే తక్కువ ధరకు ఉల్లి ఎగుమతులను అనుమతించేది లేదని ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 23: సహారా గ్రూపునకు చెందిన అంబీ వ్యాలీ ఆస్తులను వేలం వేసే విషయంలో బాంబే హైకోర్టు నియమించిన అధికారిక లిక్విడేటర్కు సహాయాన్ని అందించాలని సుప్రీం కోర్టు గురువారం బాంబే హైకోర్టు అధికారిక రిసీవర్ను ఆదేశించింది.
విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 23: ప్రపంచవ్యాప్తంగా కార్ల ఉత్పత్తిలో విశేష గుర్తింపు పొందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన నెట్వర్క్ను ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించగా, గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యాపార విపణిలోకి ప్రవేశించింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో వ్యాపారం సాగిస్తున్న జాగ్వార్ ఇప్పటివరకు 24 నగరాల్లో 26 ఔట్లెట్లు నపుడుతోంది.
న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలో డిజిటల్ (నగదు రహిత) లావాదేవీలను ప్రోత్సహించాలన్న ప్రణాళికలో భాగంగా బ్యాంకు ఖాతాదారులకు చెక్బుక్ సదుపాయాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. ‘చెక్ బుక్ సదుపాయాన్ని రద్దు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజయం లేదు.