S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/15/2017 - 00:39

ముంబయి, ఆగస్టు 14: సహారా గ్రూప్‌నకు చెందిన విలాసవంతమైన ఆంబీ వ్యాలీ రిసార్ట్ టౌన్ వేలం ప్రక్రియ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశంతో ఇది ఆరంభమవగా, ప్రారంభ ధర 37,392 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. పుణె జిల్లా లోనవాల సమీపంలో 6,761.6 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఈ హిల్ సిటీ టౌన్‌షిప్ విస్తరించి ఉంది. కాగా, ఈ లగ్జరీ రిసార్ట్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని సహారా గ్రూప్ చెబుతోంది.

08/15/2017 - 00:38

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రభుత్వ రంగ సంస్థ, దేశీయ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 23 శాతం క్షీణించింది. ఈసారి 2,351.2 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 3,065.2 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు కోల్ ఇండియా తెలియజేసింది.

08/15/2017 - 00:37

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ ఎమ్‌టిఎన్‌ఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 703.17 కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో నష్టం 718.02 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే ఆదాయం ఈసారి ఏప్రిల్-జూన్‌లో 812.66 కోట్ల రూపాయలుగా, పోయినసారి ఏప్రిల్-జూన్‌లో 881.93 కోట్ల రూపాయలుగా ఉంది.

08/15/2017 - 00:35

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగి 1,248.10 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 1,140.03 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది.

08/15/2017 - 00:40

ముంబయి, ఆగస్టు 14: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. గత వారం వరుస నష్టాల్లో కదలాడిన సూచీలు.. సోమవారం తిరిగి లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 235.44 పాయింట్లు పుంజుకుని 31,449.03 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 83.35 పాయింట్లు పెరిగి 9,794.15 వద్ద స్థిరపడింది.

08/15/2017 - 00:30

హైదరాబాద్, ఆగస్టు 14: దేశంలో ఆర్థిక వృద్ధిరేటు పెరగాలంటే పెట్టుబడులు చాలా అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సోమవారం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్లు (ఎఫ్‌ట్యాప్సీ), రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో దువ్వూరి పాల్గొన్నారు.

08/15/2017 - 00:28

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఇటు హోల్‌సేల్, అటు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు రెండూ గత నెల జూలైలో పెరిగాయి. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) విడుదల చేసిన వివరాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 1.88 శాతానికి పెరిగింది. గడచిన ఐదు నెలల్లో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి. అంతకుముందు నెల జూన్‌లో 0.90 శాతంగా ఉంటే, నిరుడు జూలైలో 0.63 శాతంగా ఉంది.

08/15/2017 - 00:27

న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశీయ ఎగుమతుల వృద్ధిరేటు 8 నెలల కనిష్టానికి పతనమైంది. గత నెల జూలైలో భారతీయ ఎగుమతుల్లో వృద్ధిరేటు 3.94 శాతానికే పరిమితమైంది. నిరుడు నవంబర్ నుంచి చూస్తే ఈ స్థాయిలో ఎగుమతుల వృద్ధి తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి. ఎగుమతులు 22.54 బిలియన్ డాలర్లుగా నమోదవగా, వాణిజ్య లోటు 11.44 బిలియన్ డాలర్లకు చేరింది.

08/15/2017 - 00:26

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్‌లోకి వచ్చిన జాతీయ జెండాలోని త్రివర్ణ ఉత్పత్తులు.. కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకున్నాయ. ముఖ్యంగా మహిళలు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల్లోని గాజులను పెద్ద ఎత్తున కొన్నారు

08/15/2017 - 00:24

51 శాతం క్షీణించిన
అపోలో హాస్పిటల్స్ లాభం

Pages