S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/06/2020 - 06:45

కరోనా వైరస్ భయంతో వణికిపోతు వివిధ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నదనడానికి నిదర్శనం ఈ చిత్రం. మాస్క్‌లు ధరించి తరగతులకు హాజరవుతున్న బ్యాంకాక్‌లోని హైస్కూల్ విద్యార్థులు

03/06/2020 - 01:01

లండన్, మార్చి 5: భారతదేశంలో కోట్లాది రూపాయల బకాయిలు ఎగవేసి, లండన్‌లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు గురువారం కొట్టివేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సుమారు 2 బిలియన్ల రుణాలను ఎగవేసిన 49 ఏళ్ల నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేసి, వాండ్స్‌వర్త్ జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి నుంచి అతను జైల్లోనే ఉన్నాడు.

03/04/2020 - 04:11

కాబూల్, మార్చి 3: అఫ్గానిస్తాన్‌లో శాంతి అనుమానాస్పదంగానే మారిపోయింది. అమెరికాకు, తాలిబన్లకు మధ్య పాక్షిక సంధి కుదిరిన కొన్ని గంటలకే అఫ్గానిస్తాన్ సైనిక స్థావరాలపై తాలిబన్లు డజనుకు పైగా దాడులు చేశారు. అధికారులు మంగళవారం ఈ విషయం వెల్లడించారు. దీంతో అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి, తాలిబన్ తిరుగుబాటుదారులకు మధ్య జరగవలసి ఉన్న శాంతి చర్చలు సందేహంలో పడ్డాయి.

03/04/2020 - 02:20

బీజింగ్: చైనాను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ దేశం దాటి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రాణాంతక వైరస్ చైనా వెలుపల విజృంభించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. వైరస్ ఎక్కడ పుట్టిందో అక్కడ ఇన్‌ఫెక్షన్ తగ్గుముఖం పట్టగా అనూహ్యంగా చైనా బయట దేశాలకు పాకింది. అమెరికాలో మంగళవారం కరోనా వైరస్ సోకి ఆరుగురు మృతి చెందడమే దాని తీవ్రతను తెలియజేస్తోంది.

03/02/2020 - 02:22

కాబూల్, మార్చి 1: అఫ్గానిస్తాన్-తాలిబన్ ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలకు దోహదం చేస్తూ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే తొలి అవరోధాల సంకేతాలు తలెత్తాయి. వచ్చే వారం జరుగనున్న కీలక చర్చల్లోగానే తాలిబన్ ఖైదీలను తాము విడుదల చేసేది లేదని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అస్రాఫ్ ఘనీ ఆదివారంనాడు ఇక్కడ ప్రకటించారు.

03/02/2020 - 02:18

వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌లో సరికొత్త శాంతి శకాన్ని ఆవిష్కరిస్తూ తాజాగా తాలిబన్లతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ‘నేను త్వరలోనే తాలిబన్ నేతలను కలుసుకుంటాను’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాలిబన్ నేతలతో తాను వ్యక్తిగతంగా సమావేశం అవుతానని పేర్కొన్న ఆయన ఒప్పందంలో భాగంగా ఇచ్చిన హామీలను తాలిబన్లు నిలబెట్టుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

03/02/2020 - 02:17

టోక్యో: వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్తగా ఎక్కడ బయటపడుతుందోనన్న భయాందోళనలు నెలకొని ఉన్న సమయంలో ఆదివారం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ అంటు వ్యాధి సోకిన వారి సంఖ్య, దీని కారణంగా మృతి చెందిన వారి సంఖ్య పెరిగింది. పర్యాటకులు, శ్రామికులు లేకుండా వీధులన్నీ బోసిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కంపిస్తున్నాయి. దైనందిన జీవిత వాస్తవాలు మారిపోతున్నాయి.

03/01/2020 - 03:44

దోహా, ఫిబ్రవరి 29: అఫ్గానిస్తాన్‌లో శాంతిని నెలకొల్పే దిశగా ఒక అడుగు పడింది. అఫ్గానిస్తాన్ భవిష్యత్తును నిర్ణయించే ఒక చరిత్రాత్మక ఒప్పందాన్ని అమెరికా శనివారం తాలిబన్లతో కుదుర్చుకుంది. అత్యంత దీర్ఘకాలికంగా సాగుతున్న అఫ్గానిస్తాన్ యుద్ధం నుంచి వైదొలగాలని కోరుకుంటున్న అమెరికా అందుకు అనుగుణంగా అఫ్గానిస్తాన్ నుంచి 14 నెలలలోపు తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి

02/27/2020 - 23:38

జెనీవా: భారత ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం.. అలాగే, దానిపై జరుగుతున్న హింసాకాండ పట్ల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో మతపరమైన దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదన్న కథనాలపై తీవ్రంగా స్పందించింది.

02/27/2020 - 23:21

వాషింగ్టన్, ఫిబ్రవరి 27: భారత్‌తో అమెరికా సంబంధాలు ఇప్పుడు అసాధారణ స్థాయిలో ఉన్నాయని, అద్భుతమయిన భారతదేశంలో తాను ఇటీవల తొలిసారి అధికారికంగా పర్యటించిన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమయిన పురోగతి చోటు చేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్‌తో అమెరికా పెద్ద మొత్తంలో వ్యాపారం చేయబోతోందని ఆయన పేర్కొన్నారు.

Pages