S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఏటా లక్షలాదిమందిని పొట్టనపెట్టుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిని ని యంత్రించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో దీర్ఘవ్యాధులతో మరణిస్తున్న వారిలో 35 శాతం మంది క్యాన్సర్ బారినపడ్డవారే. ఏటా కొత్తగా పది లక్షల మంది క్యాన్సర్ వ్యాధులకు లోనవుతున్నారు.
‘ఏ జాతి పక్షి ఆ జాతి సమూహంతోనే ఎగురుతుంద’నేది ఓ ఆంగ్ల సామెత. బుద్ధిజీవులైన మానవులకు కూడా ఈ సూత్రీకరణే బాగా అలవడింది. ఒకప్పుడు దేశాల సౌభ్రాతృ త్వం చుట్టూ తిరిగే రాజకీయాలు, త్యాగ నిరతిని, ప్రాణ త్యా గాన్ని ఆభరణాలుగా భావించే ఈ ప్రాపంచిక రాజకీయాలు సమీకరణలను మార్చుకోవడం గత రెండు దశాబ్దాలకు పైగా శీఘ్రతరమైంది.
వరంగల్(కల్చరల్), జనవరి 22: వరంగల్ భద్రకాళీ దేవాలయ క్షేత్రంలో శతచండీయాగం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యాహ్నికం, ప్రాతఃకాలార్చన జరిపారు. ఐదు రోజుల పాటు జరుపబడే శతచండీ యాగంలో భాగంగా ఆదివారం వేదపండితులు తాతాభట్ల నృసింహశర్మ ఆధ్వర్యంలో ఉదయం 8గంటలకు యాగశాల ప్రవేశం, భూతోత్సాదనం, మంటప స్థూనపూజ, ధ్వజారోహణం, కర్కరీస్థాపన పూజలు చేసారు.
నెక్కొండ,జనవరి 22: నెక్కొండ మండలం పెద్దకొర్పోలు కస్తూర్భాగాంధీ గిరిజన బాలికల గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలపై సమాచారం అందుకున్న ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేయడంతో అధికార యంత్రాంగలంలో కదిలిక మొదలైంది. గురుకుల సమస్యలపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించిన నేపథ్యంలో ఆదివారం జాయింట్ కలెక్టర్ హరిత గురుకులానికి చేరుకొని ఆగమేఘాలపై విచారణ జరిపారు.
జనగామ టౌన్, జనవరి 22: జనగామ మినీస్టేడియంలో పదివేల మంది బాలికలతో వినూత్న తరహాలో మార్షల్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జనగామ కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. ఆదివారం పట్టణంలోని సంజయ్నగర్ మినిస్టేడియంలో బాలికలతో ‘సంఘటిత సబల’ సామూహిక ప్రదర్శన నిర్వహించుటకు చేస్తున్న ఏర్పాట్లను ఆమె సందర్శించారు.
పర్వతగిరి, జనవరి 22: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు కుటుంబ సభ్యులను ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , ఎంపి కవితతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఎర్రబెల్లి దయాకర్రావు తల్లి ఆదిలక్ష్మి గత వారం మృతిచెందగా ఆమె మృతికి సంతాపం ప్రకటించిన తెరాస నేతలు ఎర్రబెల్లిని ఓదార్చారు.
ఖానాపూర్ రూరల్, జనవరి 22: మండలంలోని బాదన్కుర్తి పరిధిలోని గోదావరి ఒడ్డున యాసంగి పంటల కోసం గోదావరి నది ఒడ్డున రైతులు ఏర్పాటుసుకున్న విద్యుత్ మోటార్ల వైర్లకు ఆదివారం 3 గంటల ప్రాంతంలో గేదెలు అటువైపు వెళ్లి విద్యుద్ఘాతానికి గురై 18 గేదెలు మృతిచెందాడు. ఒక్కొక్క గేదె విలువ 30 వేల రూపాయలు ఉంటుందని సర్పంచ్ గడ్డం మోహన్ తెలిపారు.
ఆదిలాబాద్ రూరల్, జనవరి 22: ఆన్లైన్ మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసు సిబ్బంది సైతం ప్రజలను చైతన్యపర్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం నుండి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా పోలీసు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఆదిలాబాద్ టౌన్, జనవరి 22: విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ అధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎఐఎస్ఎఫ్ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు ఆవిష్కరించారు.
తాండూర్, జనవరి 22: గ్రామీణ ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లక్షలాది రూపాయలు కేటాయిస్తున్న ప్రజలకు తాగునీటి కష్టాలు తీరడంలేదు. మండలంలోని కొత్తపల్లి పరిధిలోని ఎంవికె-5 ఇంక్లయిన్లో దాదాపు 25 కుటుంబాలు జీవిస్తున్నాయి. స్థానికులు ప్రధానంగా కూలీ పనిచేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.