-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఆదిలాబాద్, ఏప్రిల్ 6: బోథ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయిదత్త జిన్నింగ్ ఫ్యాక్టరీలో గత నెల 29న భారీ ఎత్తున చోరీ జరగగా కేసును వారం రోజుల్లోనే సిసిఎస్ పోలీసులు ఛేదించి నిందితున్ని అరెస్ట్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆదిలాబాద్ డిఎస్పీ కె.నర్సింహారెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీ సంఘటన వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం కేసు విచారణను ఈ నెల 9వ తేదీ నుంచి హైకోర్టు ప్రారంభించనుంది. ఈ కేసులో రాష్ట్రప్రభుత్వం తరఫున న్యాయ విభాగ కార్యదర్శి వి నిరంజన్రావు కౌంటర్ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్నికల సంఘం కూడా కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ముస్లింలలో బహుభార్యాత్వం కంటే, రామజన్మభూమి చాలా ముఖ్యమైన అంశమని, అందువల్ల దీన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ, ముస్లింల తరపున వాదిస్తున్న న్యాయవాది రాజీవ్ ధావన్, సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ముందు, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన 14 అప్పీళ్లు ఉన్నాయి.
కడప, ఏప్రిల్ 6 : కడప నగరంలోని సెంట్రల్ జైలు లో శుక్రవారం మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ సునీల్కుమార్(35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వి వరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్స్టర్ సునీల్కుమార్ను గురువారం కడప జిల్లా పోలీసులు అరెస్టు చేసి, నగరంలో ని సెంట్రల్ జైలులో ఉంచారు.
ధారూర్, ఏప్రిల్ 6: భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో భార్య పుట్టింటికి వెళ్లి.. మళ్లీ రాకపోవడాన్ని అవమానంగా భావించిన భర్త తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన ధారూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గురుదోట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పులిచింతల మడుగు తండాకు చెందిన గుండ్యా నాయక్ (51) అతని భార్య సోనీబాయి తరచూ గొడవలు పడేవారు.
కురబలకోట, ఏప్రిల్ 6: కురబలకోట మండలం మోదివేడు క్రాస్ వద్ద నివాసం ఉంటున్న కృష్ణమ్మ (90) అనే వృద్ధురాలిని ఆమె మనవడు ఇంద్రప్రసాద్ శుక్రవారం రాత్రి హత్య చేసి పారిపోయాడు. మృతురాలు కృష్ణమ్మ గత ఎంతో కాలంగా మోదివేడు క్రాస్ వద్ద ఉన్న తన కుమార్తె వద్ద ఉంటోంది. ఆమె కుమార్తెకు ఇంద్ర ప్రసాద్ అనే మనవడు ఉన్నాడు. గతంలో వెలుగు బస్సులో డ్రైవర్గా పనిచేస్తూ మద్యానికి బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
నెల్లూరు, ఏప్రిల్ 6: నగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రైలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని విజయమహల్ రైల్వేగేటు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
దొరవారిసత్రం, ఏప్రిల్ 6 : దొరవారిసత్రం మండల పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలమంచలి పతాంజలి (62) అనే ప్రముఖ కాంట్రాక్టర్ మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ తానంకి నానాజీకి మామ అయిన పతాంజలి జీవీఆర్ ఇన్ఫ్రాస్టక్చర్లో సబ్ కాంట్రాక్టర్గా పనులు చేస్తూ సూళ్లూరుపేటలో నివాసం ఉంటున్నారు.
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 6: కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో బెంచి కొట్టాల గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఏడాది క్రితం నాలుగు కుంచు దేవత విగ్రహాలను చోరీ చేసిన ఏడుగురు దొంగలను అనంతపురం సీసీఎస్, వన్టౌన్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు డిఎస్పీ వెంకట్రావు తెలిపారు. వీరి వద్ద నుంచీ రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
పెద్దదోర్నాల, ఏప్రిల్ 6: మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని అయినముక్కుల గ్రామ పొలాల్లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు అయినముక్కుల గ్రామం దాసరికాలనీకి చెందిన బి రాములమ్మ (40) హత్యకు గురైంది. గ్రామస్తులు శుక్రవారం పొలం పనులకు వెళ్తుండగా రాములమ్మ మృతదేహం పత్తిపొలంలో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.