పానుగంటి వారి అద్వితీయ సాహితీ సృష్టి ‘వైష్ణవ సాక్షి’
Published Tuesday, 31 May 2016గుంటూరు (కల్చరల్), మే 30: తెలుగు సాహిత్య చరిత్రలో నవీన అధ్యాయానికి నాంది పలికి, తన వచన, రచనా పటిమతో ఎన్నో పుస్తకాలను, వ్యాసాలను రచించి పాఠక లోకాన్ని సుదీర్ఘకాలం పాటు ఆత్మీయంగా ఆకట్టుకుని, గిలిగింతలు పెట్టిన వైష్ణవ సాక్షి పానుగంటి వారి అద్వితీయ సాహితీ సృష్టి అని పలువురు సాహితీవేత్తలు ప్రశంసల జల్లులు కురిపించారు. సోమవారం రాత్రి నగరంలోని బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై జగమెరిగిన సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన సాక్షి వ్యాసాల్లోని శ్రీ వైష్ణవ సంబంధ వ్యాస సంకలనమైన వైష్ణవ సాక్షి పుస్తకావిష్కరణ సభ జరిగింది.