చిత్తూరు కోర్టుకు హాజరుకాని సంగీతా ఛటర్జీ
Published Tuesday, 31 May 2016చిత్తూరు, మే 30: ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలను నడుపుతున్న కలకత్తాకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీతా ఛటర్జి కలకత్తా కొర్టు ద్వారా ముందస్తు బెయిల్ తీసుకొన్నట్లు చిత్తూరు పోలీసులకు సమాచారం అందింది. చిత్తూరు జిల్లాలో పు కేసులు నమోదయిన నేపథ్యంలో సోమవారం చిత్తూరు కోర్టుకు ఆమెహాజరు కావాల్సిఉంది, అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని కలకత్తా కొర్టులో పిటీషన్ ధాఖలు చేయడంతో కోర్టు ఈమేరకు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.