-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
మొహాలీ, అక్టోబర్ 23: రెండో వనే్డలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ సంఘం (పిసిఎ) మైదానంలో జరిగిన మూడో వనే్డలో టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ శతకంతో కదం తొక్కి, భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు.
మొహాలీ, అక్టోబర్ 23: భారత వనే్డ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఫార్మాట్లో 9,000 పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాట్స్మెన్ జాబితాలో స్థానం సంపాదించాడు. ఈ మ్యాచ్లో 80 పరుగులు చేసిన అతని ఖాతాలో ఇప్పుడు మొత్తం 9,058 పరుగులు ఉన్నాయి. కాగా, వనే్డల్లో పది వేలకుపైగా పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
హూగెవీన్ (డెన్మార్క్), అక్టోబర్ 23: భారత గ్రాండ్మాస్టర్, కామనె్వల్త్ చాంపియన్ అభిజిత్ గుప్తా ఇక్కడ జరిగిన హూగెవీన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ టైటిల్ను నిలబెట్టుకున్నాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ‘్ఫడే’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో వరుసగా రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన ఆటగాడిగా అతను రికార్డు నెలకొల్పాడు.
మాడ్రిడ్, అక్టోబర్ 23: బార్సిలోనా కెప్టెన్ ఆండ్రెస్ ఇనెస్టా మోకాలుకు బలమైన గాయం తగిలింది. దీనితో అతను కనీసం మూడు వారాలు సాకర్కు దూరంకానున్నాడు. వలెన్షియాతో జరిగిన మ్యాచ్లో ఆడుతూ, 14వ నిమిషంలోనే ఇనెస్టా గాయపడ్డాడు. నొప్పితో బాధపడుతూ కదల్లేని పరిస్థితిలో ఉన్న అతనిని నిర్వాహకులు స్ట్రెచర్పై బయటకు తీసుకెళ్లారు.
చిట్టగాంగ్, అక్టోబర్ 23: బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నది. మ్యాచ్ చివరి రోజైన సోమవారం ఇంకా 33 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది. రెండు వికెట్లు పడగొట్టగలిగితే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. ఈ పరిస్థితుల్లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.
శనివారం అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ కప్ కబడ్డీ ఫైనల్లో భారత జట్టు ఇరాన్ను 9 పాయింట్ల తేడాతో ఓడించి టైటిల్ను నిలబెట్టుకుంది. కొత్త ఫార్మెట్లో జరిగిన మూడో ప్రపంచ కప్ కబడ్డీ టోర్నీలో భారత్ వరసగా మూడోసారి టైటిల్ను దక్కించుకుని హ్యాట్రిక్ నమోదు చేసింది. అజయ్ ఠాకూర్ పర్ఫెక్ట్ టెన్తో రాణించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అహ్మదాబాద్, అక్టోబర్ 22: ప్రపంచ కబడ్డీ చాంపియన్షిప్ టైటిల్ను భారత్ వరుసగా మూడోసారి గెల్చుకొని హ్యాట్రిక్ సాధించింది. మొత్తం మీద ఈ టైటిల్ను అందుకోవడం మన దేశానికి ఇది ఎనిమిదోసారి. శనివారం ఇరాన్తో జరిగిన ఫైనల్లో 38-29 తేడాతో విజయం సాధించి, అంతర్జాతీయ కబడ్డీలో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకుంది. సూపర్ టెన్ను సాధించిన అజయ్ ఠాకూర్ భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు.
మొహాలీ, అక్టోబర్ 22: మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 3-0 తేడాతో న్యూజిలాండ్కు వైట్వాష్ వేసిన భారత క్రికెట్ జట్టు వనే్డ సిరీస్లో తడబడుతున్నది. ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డను గెల్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత్కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన రెండో మ్యాచ్లో చుక్కెదురైంది. చివరి వరకూ పోరాడినప్పటికీ, పరుగుల వేటలో విఫలమై, ఆరు పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.
మొహాలీ, అక్టోబర్ 22: న్యూజిలాండ్పై భారత్ రెండు వనే్డల్లోనూ టాస్ను గెలిచింది. ధర్మశాల, ఢిల్లీల్లో మాదిరిగానే మరోసారి కెప్టెన్ ధోనీ టాస్ నెగ్గితే, కివీస్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే కీలక బాధ్యతను బౌలర్లు స్వీకరించాలి. చాలాకాలం తర్వాత భారత్కు సీమర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య రూపంలో లభించాడు. ఢిల్లీ వనే్డలో అతను జట్టును విజయం అంచుల వరకు చేర్చాడు.
కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 22: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగబోయే మ్యాచ్ ఉత్కంఠ రేపుతున్నది. ఇరు దేశాల సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో జరగుతున్న ఈ మ్యాచ్పైనే అభిమానులు దృష్టి సారిస్తున్నారు. క్రికెట్ లేదా కబడ్డీ, ఫుట్బాల్ లేదా హాకీ.. భారత్, పాక్ మధ్య జరిగే ఏ పోరులోనైనా యుద్ధ వాతావరణం నెలకొంటుంది.