S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/22/2016 - 07:34

కాన్పూర్, సెప్టెంబర్ 21: భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి చారిత్రక టెస్టు మ్యాచ్‌ని ఆడనుంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే ఈ మొదటి మ్యాచ్ టీమిండియాకు 500వ టెస్టు కావడం విశేషం. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడానికి విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది. బ్రిటిష్ వలస దేశంగా 1932లో భారత్ మొదటిసారి టెస్టు మ్యాచ్ ఆడింది.

09/22/2016 - 07:33

ముంబయి, సెప్టెంబర్ 21: బిసిసిఐ కార్యదర్శిగా 62 ఏళ్ల అజయ్ షిర్కే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బుధవారం ఇక్కడ జరిగిన 87వ వార్షిక సర్వసభ్య సమావేశం అజెండాలో ఇదే కీలకాంశం. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌షిప్ కోసం బోర్డు అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేయడంతో, అతని స్థానంలో, ఈ ఏడాది జూలై మాసంలో అనురాగ్ ఠాకూర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.

09/22/2016 - 07:32

విజయవాడ (స్పోర్ట్స్): గుంటూరులో 1975 ఏప్రిల్ 24న జన్మించిన ఎమ్మెస్కే ప్రసాద్ అంతర్జాతీయ కెరీర్‌ను మొహాలీలో ప్రారంభించాడు. టెస్టు, వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అతని ప్రస్థానం మొహాలీలోనే మొదలుకావడం విశేషం. 1998 మే 14న బంగ్లాదేశ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌తో అతను వనే్డల్లో అరంగేట్రం చేశాడు.

09/22/2016 - 07:31

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రీతూ రాణి కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. రియో ఒలింపిక్స్‌కు ఎంపిక చేయకపోవడం ఆమెను మానసికంగా కుంగతీసింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ) వైఖరిని నిరసిస్తూ, బహిరంగంగానే వ్యాఖ్యలు చేసింది. హాకీ శిక్షణ శిబిరానికి ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో రీతూకు చోటు కల్పించినప్పటికీ ఆమె సంతృప్తి చెందలేదు.

09/21/2016 - 13:52

ముంబయి: ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో సందీప్‌ పాటిల్‌ స్థానంలో భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ సెలక్షన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడైన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. ఎమ్మెస్కే భారత్‌ తరపున 6 టెస్టులు, 17 వన్డేలు ఆడారు.

09/21/2016 - 00:34

ముంబయి, సెప్టెంబర్ 20: దేశంలో క్రికెట్‌ను ఒక గాడిలో పెట్టడానికి, పాలనా వ్యవహారాలను పారదర్శంగా ఉంచడానికి సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమవుతున్నప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని అనుసరించడంలేదు. సమస్యను దాటవేయడానికి ప్రయత్నిస్తున్నదని బుధవారం నాటి వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) అజెండా స్పష్టం చేస్తున్నది.

09/21/2016 - 00:32

కాన్పూర్, సెప్టెంబర్ 20: న్యూజిలాండ్‌పై స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించి విజయాలను నమోదు చేయడానికి భారత క్రికెట్ జట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నది. పిచ్‌లను స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా తయారు చేసుకొని, స్వదేశంలో రెచ్చిపోవడం టీమిండియాకు అలవాటే. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల నుంచి జట్టు కోచ్, కెప్టెన్ వరకూ ప్రతి ఒక్కరూ క్యూరేటర్లపై ఒత్తిడి పెంచేవారే.

09/21/2016 - 00:22

కాన్పూర్, సెప్టెంబర్ 20: అనారోగ్యంతో బాధపడుతున్న భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగే మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతను వైరల్ జ్వరంతో బాధపడుతున్నాడని తెలిపింది. విశ్రాంతి అవసరం కాబట్టి, మొదటి టెస్టులో అతను ఆడే అవకాశం లేదని పేర్కొంది. అయితే, ఇశాంత్‌కు రీప్లేస్‌మెంట్‌ను భారత కోచ్ అనీల్ కుంబ్లే కోరడం లేదు.

09/21/2016 - 00:20

ముంబయి, సెప్టెంబర్ 20: ప్రపంచ కప్ కబడ్డీలో పాకిస్తాన్‌ను ఎందుకు ఆహ్వానించడం లేదన్న ప్రశ్నపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ తీవ్రంగా స్పందించాడు. పాక్‌పై ప్రశ్న వేయడానికి సమయం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

09/21/2016 - 00:18

టోక్యో, సెప్టెంబర్ 20: జపాన్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. మంగళవారం అతను రెండో క్వాలిఫయింగ్‌లో డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ అన్టోనె్సన్‌ను 21-18, 21-12 తేడాతో ఓడించాడు. కాలి గాయంతో బాధపడుతూ ఇటీవల కాలంలో టోర్నీలకు దూరమైన కారణంగా కశ్యప్ క్వాలిఫయర్స్‌లో పోటీపడాల్సి వచ్చింది.

Pages