S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/09/2017 - 03:38

విశాఖపట్నం, డిసెంబర్ 8: రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ విచ్చేసిన భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు శుక్రవారం తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు లభించింది.

12/09/2017 - 03:36

కొత్తగూడెం, డిసెంబర్ 8: మజ్లీస్ పార్టీ ఎజెండాను రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ మతతత్వ శక్తులను ప్రోత్సహిస్తోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. నిజాంను కీర్తిస్తూ తెలంగాణ అమర వీరులను అమానపరచే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

12/09/2017 - 03:30

ఖాజీపేట,డిసెంబర్ 8: రాష్ట్రంలోని కడప జిల్లా, తెలంగాణలోని ఖమ్మం జిల్లాల్లో త్వరలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటవుతాయని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉక్కు కర్మాగారాల నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం జరిగిన అనిబిసెంట్ మున్సిపల్ స్కూల్ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ కర్మాగారాలకు సంబంధించిన ఫైళ్లు కేంద్ర మంత్రుల వద్ద ఉన్నాయన్నారు.

12/09/2017 - 02:18

హైదరాబాద్, డిసెంబర్ 8: ఇంటర్మీడియట్ విద్యను పటిష్టం చేసి తెలంగాణను దేశంలోనే ప్రథమస్థానంలో నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రిన్సిపాళ్ల వర్కుషాప్‌నకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధ్యాపకులు బోధనను ఉద్యోగ ధర్మంగాకాకుండా సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు.

12/09/2017 - 02:16

కరీంనగర్, డిసెంబర్ 8: కోటి ఏకరాలకు సాగు నీరందించే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్నిపనులు సమాంతరంగా, పటిష్టంగా, సకాలంలో జరిగేలా చూడాలని, వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంతమేర నీటిని గోదావరి నంచి తీసుకోవాలని సూచించారు.

12/09/2017 - 02:12

తిరుపతి, డిసెంబర్ 8: సర్వదర్శనం భక్తులు కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉండకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఈనెల 18 నుంచి ప్రయోగాత్మకంగా టైంస్లాట్ విధానాన్ని అమలు చేస్తామని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు.

12/09/2017 - 02:10

ప్రొద్దుటూరు, డిసెంబర్ 8: అమ్మాయిలను చదివించడం పవిత్ర కార్యమని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. వేదకాలం నుంచి మహిళలకు ప్రాముఖ్యత ఉందన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ స్కూల్ శతాబ్ధి ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన వెంకయ్య మాట్లాడుతూ అమ్మాయిలను చదివించడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు.

12/09/2017 - 02:09

హైదరాబాద్, డిసెంబర్ 8: ‘వ్యక్తులు వస్తుంటారు... పోతుంటారు. కానీ తెలంగాణలో పార్టీ చెక్కు చెదరలేదు. కార్యకర్తలు బలంగా, ఆత్మవిశ్వాసంతో పార్టీనే నమ్ముకుని ఉన్నారు..’ అని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

12/09/2017 - 02:06

చింతూరు, డిసెంబర్ 8: తూర్పు గోదావరి జిల్లా చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన మినీ వ్యాను (టాటా ఏస్) లోయలోకి బోల్తాపడిన దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే నలుగురు మృతిచెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు.

12/09/2017 - 02:03

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రంలో పర్యటిస్తున్న జనసేన అధినేత, సీనీనటుడు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని తెలుగుదేశం నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్షం పోలవరంపై అవాస్తవాలు, అబద్ధాలు, అభూతకల్పనలు ప్రచారం చేస్తోందన్నారు.

Pages