S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/23/2018 - 01:09

హైదరాబాద్/ విజయవాడ, ఏప్రిల్ 22: ప్రముఖ రచయిత, గాయకుడు, సంగీత విద్వాంసుడు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం మాజీ డైరెక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు (98) ఆదివారం తెల్లవారు జామున 5.30కు విజయవాడలో కన్నుమూశారు. రజనీకాంతరావుకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రజనీకాంతరావు అంత్యక్రియలు సోమవారం ఉదయం 10.30కు విజయవాడలోని ‘స్వర్గపురి’లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

04/23/2018 - 01:06

హైదరాబాద్, ఏప్రిల్ 22: కేంద్రంలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల మతతత్వ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వామపక్ష, ప్రజాతంత్ర, ప్రజాసంఘాలన్నీ సంఘటితం కావాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయో సర్కార్ వల్ల ఏమైనా జరిగిందా? అంటే ఆర్థిక దోపిడి మరింత పెరగడం తప్ప మరేమి లేదన్నారు.

04/22/2018 - 04:37

సింహాచలం: పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచలంలో పెద్దలు కుదిర్చే సంప్రదాయ వివాహాలే కాదు కులాంతర, ఆదర్శ, ప్రేమ వివాహాలు కూడా భారీ సంఖ్యలో జరగడం అందరికీ తెలిసిన విషయమే. విశేష చరిత్ర కలిగిన వరాహ నారసింహుడు కొలువైవున్న సింహాచలం శనివారం మరో అరుదైన ప్రభుత్వ కార్యక్రమానికి వేదికగా నిలిచింది.

04/22/2018 - 03:40

విశాఖ (జగదాంబ), ఏప్రిల్ 21: నేను రాజకీయాల్లోకి రాకుండానే అన్ని పార్టీల్లోకి మీరే (మీ- మీడియా) చేర్చేశారంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఛలోక్తి విసిరారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన శనివారం సంపత్ వినాయగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చే ముందు మీడియాకు తప్పకుండా వెల్లడిస్తానన్నారు.

04/22/2018 - 03:17

విశాఖపట్నం, ఏప్రిల్ 21: ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

04/22/2018 - 03:11

తిరుపతి, ఏప్రిల్ 21: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావును టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ చానల్‌కు చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈవిషయాన్ని శనివారం టీటీడీ పిఆర్వో డాక్టర్ తలారి రవి ఒక ప్రకటనలో తెలియజేశారు.

04/22/2018 - 04:07

నెల్లూరు, ఏప్రిల్ 21: విజయవాడలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నెల్లూరులో శనివారం జిల్లా బిజెపీ నేతలు చేపట్టిన నిరసన ఇరు పార్టీల నడుమ ఘర్షకు దారితీసింది.

04/22/2018 - 02:58

హైదరాబాద్, ఏప్రిల్ 21: స్వావలంబన, స్వయంకృషితో పత్రికా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహిళా జర్నలిస్టు, ఆంధ్రభూమి వార, మాసపత్రికల అసిస్టెంట్ ఎడిటర్ అయ్యగారి సీతా లక్ష్మి ప్రతిష్టాకరమైన లేడీ లెజెండ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 22వ తేదీన (ఆదివారం) ఇక్కడ జరిగే ఒక కార్యక్రమంలో రాజా రతన్ హెల్త్, ఎడ్యుకేషన్ ట్రస్టు, ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ నుంచి ఆమె ఈ అవార్డును స్వీకరించనున్నారు.

04/22/2018 - 02:11

హైదరాబాద్, ఏప్రిల్ 21: సీపీఎం పార్టీ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈనెల 18న పా ర్టీ సీనియర్ నాయకులు మల్లు స్వరాజ్యం జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన మహాసభలు ఆదివారం జరిగే బహిరంగ సభతో ముగియనున్నాయి.

04/22/2018 - 02:08

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్వీట్ల పర్వాన్ని శనివా రం నాడూ కొనసాగించారు. ‘నిజవైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా’ అంటూ ట్వీట్ చేశారు. కాస్సేపు అయ్యాక నాకు ఇష్టమైన స్లోగన్ ‘ప్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలి అనే నినాదం.. అసలు ఈ నినాదం వెనక ఉన్న కథకు, ఈ స్లోగన్‌కు ఉన్న సంబంధం ఏమిటి?

Pages