-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
సిద్దిపేట, జూలై 2: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ పనుల్లో అడ్డగోలుగా అవినీతి జరుగుతుందని మాజీ ఎంపి, టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వేలకోట్ల రూపాయలు ప్రచారానికి వాడుతూ అందరి దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తున్నా ప్రయోజనం శూన్యమన్నారు. నేతి బీరకాయలో నేతి ఉందన్నది ఎంత నిజమో మిషన్ కాకతీయ పూడికలో కూడా అంతే నిజముందని విమర్శించారు.
గజ్వేల్, జులై 2: రాష్ట్రంలో పేద వైశ్యులను ఆదుకునే క్రమంలో రూ. 1000 కోట్లతో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు సిఎం కెసిఆర్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ దామోదర్గుప్త పేర్కొన్నారు. ఆదివారం నాచగిరి శ్రీ లక్ష్మినృసింహ క్షేత్ర ఆవరణలో నిర్వహించిన జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడారు.
లక్ష్మణచాంద/నిర్మల్, జూలై 2: లక్ష్మణచాంద పోలీస్స్టేషన్ ఆవరణలో ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెంతిన ఒల్లెపు అమృత్(40) అనే వ్యక్తి ఆదివారం ఉదయం స్టేషన్కు వచ్చి ఎస్ఐ ప్రశ్నించిన తర్వాత బయటకు వచ్చి పురుగుల మందు తాగి మృతిచెందిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి, జూలై 2: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన 80 గజాల ఇంటి స్థలాల వివాదం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. ఇటీవలే నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ఇళ్ల స్థలాలను కబ్జా చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
చిత్రం.. న్యాయశాఖ కార్యదర్శిగా నియామకమైయిన నిరంజన్రావు ప్రగతి భవన్లో ఆదివారం
ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసిన దృశ్యం
హైదరాబాద్, జూలై 2: వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలకు భారత్ ముందు వరుసలో ఉందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (తెలంగాణ పోలీస్ అకాడమి) జితేందర్ అన్నారు. విదేశీయులు సైతం భారత్ వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని, వైద్యుల ప్రతిభతోనే వైద్యరంగంలో భారత్ రాణిస్తుందని చెప్పారు. ఆదివారం కాంటినెంటల్ ఆసుపత్రిలో ‘ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్’పై వర్కుషాపు జరిగింది.
హైదరాబాద్, జూలై 2: ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు వారు తల ఎత్తుకుని బతికే ధైర్యాన్ని టిడిపి వ్యవస్థాప అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కల్పించారని ఆ పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలిపారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అధ్వర్యం లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలు కార్యక్రమంలో భాగంగా ఆదివా రం నాట్స్ ప్రతినిధులు ఆయన్ను సన్మానించారు.
హైదరాబాద్, జూలై 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సమయంలో లోక్సభ స్పీకర్గా ఉన్న మీరా కుమార్ ఎంతో సహకరించినందున ఆమె కృతజ్ఞతాభావంగా ఓట్లు వేయాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కోరారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతునిస్తున్న టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.
హైదరాబాద్, జూలై 2: తెలంగాణ ప్రభుత్వం వచ్చే వారమే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని (రేరా)ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయనుంది. రెగ్యులేషన్ చట్టంపై ఆర్డినెన్సును తేనుంది. ఈ అంశంపై ముసాయిదా బిల్లును రూపొందించారు. ఇప్పటికే కేంద్రంతో పాటు రాష్ట్రాలు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా)ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.
హైదరాబాద్, జూలై 2: రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న లోక్ సభ మాజీస్పీకర్, యూపిఏ అభ్యర్థి మీరాకమార్ ఓట్ల కోసం సోమవారం హైదరాబాద్ రానున్నారు. కానీ మీరా కుమార్ రోజంతా గడిపి, జరిపే చర్చలతో సాధించేది ఏమిటీ?, ఒనగూరేంత లాభం ఎంత అని పరిశీలిస్తే కొత్తగా ఆమెకు మద్దతు ఇచ్చేందుకు ఓటర్లు లేరు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ఆమెను అభ్యర్థిగా నిలిపిన సంగతి తెలిసిందే.