-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
అమరావతి, అక్టోబర్ 15: కర్నూలు ఎంపీ (వైసిపి) బుట్టా రేణుక నవంబర్ 1న తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఈమేరకు ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్తో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా వైసీపీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమయింది.
కర్నూలు, అక్టోబర్ 15 : రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా ఉండాలని గత కొంతకాలంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను నిజం చేసేందుకు తెర వెనుక భారీ కసరత్తే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ, అక్టోబర్ 15: ప్రతిభా పురస్కార గ్రహీతల జీవిత లక్ష్యాలను తెలుసుకుని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఇక్కడ జరిగిన సభలో వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంలో విద్యార్థులు తమ ఆశలు, ఆశయాలు చెపుతుంటే వింటూ ముఖ్యమంత్రి మురిసిపోయారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని ఓ కళాశాల నుంచి బిట్స్ పిలానీకి ఎంపికైన షేక్ షర్మిల మాటలకు ముఖ్యమంత్రి ఆద్యంతం సంతోషంగా కనిపించారు.
అమరావతి, అక్టోబర్ 15: కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసి, ఆ కులానికి చెందిన యువతకు సొంత ఖర్చులతో విదేశీ విద్యా రుణాలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ గత కొద్దికాలం నుంచీ గాడితప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యల కొరడా ఝుళిపించటం సంచలనం రేపింది. కార్పొరేషన్ ఎండీ అమరేంద్రపై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలమే రేపింది.
అమరావతి, అక్టోబర్ 15: సొంత పార్టీకి చెందిన మంత్రులు, నేతల విద్యాసంస్థల్లో శరపరంపరగా కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలతో పార్టీ, ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతున్నాయన్న ఆందోళన టిడిపి వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రాజమహేంద్రవరం, అక్టోబర్ 15: రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ సంక్షేమ పథకాలను అందుకుని బ్రాహ్మణ మహిళలు అభివృద్ధి సాధించాలని రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు ఆదివారం జరిగింది.
విజయవాడ, అక్టోబర్ 15: కాపు కార్పొరేషన్ ఎండీ అమరేంద్రపై వేటు పడిన నేపథ్యంలో ఆయన ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హైడ్రామా నడిచింది. నగరంలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు తన చాంబర్లో అమరేంద్ర కూర్చున్న సమయంలో సంస్థ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అక్కడికి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
అమరావతి, అక్టోబర్ 14: గత మూడేళ్ల నుంచి బదిలీల పర్వంలో జరుగుతున్న రాజకీయ జోక్యం వల్ల వచ్చిన అప్రతిష్ఠకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరదించే ప్రయత్నాలు ప్రారంభించారు.
విశాఖపట్నం (క్రైం), అక్టోబర్ 14: కంచే చేను మేసింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో హత్యకు పథకం వేసిన పోలీసు అధికారి పాత్ర సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. వెరసి రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితునిగా తేలి, ప్రస్తుతం పరారీలో ఉన్న డిఎస్పీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విశాఖ నగరం గాజువాకకు చెందిన కొప్పెర్ల సత్యనారాయణ రాజు (గేదెల రాజు) ఈ నెల 6న దారుణ హత్యకు గురయ్యాడు.
విజయవాడ, అక్టోబర్ 14: దేశంలో మాటల మరాఠీ నరేంద్రమోదీ పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో బిజెపి అధ్యక్షుడు అమిత్షా కీలక వ్యక్తిగా మారారనీ, ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తూ అమిత్షా ‘మాట్లాడే ప్రధానిని ఇచ్చాం’ అని చెబుతున్నారని, నిజంగానే మోదీ ‘మాటల మారాఠీ’ అని అన్నారు.