-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూలై 20: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ-మచిలీపట్నం మధ్య చేపట్టిన నాలుగు లైన్ల రహదారి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖాధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాజమహేంద్రవరం, జూలై 20: తూర్పు గోదావరి జిల్లాపై నిఘా నీడ ఆవరించింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో పోలీసు శాఖ ముందుగానే అప్రమత్తమయ్యింది. ఇప్పటికే జిల్లాలో కొన్ని రహదారులను పోలీసులు స్వాధీనంలోకి తీసుకుని పోలీసు పికెట్లు నిర్వహిస్తున్నారు.
భీమవరం, జూలై 20: పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ దశ నుంచి యంత్ర పరికరాలు బిగించే స్థాయికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా వివధ ప్రాంతాల నుంచి భారీ కంటైనర్లతో వీటిని తీసుకువస్తున్నారు.
రాజమహేంద్రవరం, జూలై 20: భారీ వర్షాలు తూర్పు గోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులకు ప్రతిబంధకంగా మారాయి. పైపులైన్, పంపుహౌస్ నిర్మాణ పనులకు విఘాతం ఏర్పడింది. పంపుహౌస్ పనులు జరుగుతున్న గట్టు వరకు గోదావరి వరద నీటి ప్రవాహం తాకుతోంది. ముఖ్యమంత్రి గత సోమవారం ప్రాజెక్టు పనులను పరిశీలించి, సమీక్షించేందుకు ఏర్పాట్లుచేశారు.
అమరావతి, జూలై 20: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం సత్ఫలితాలనిస్తోంది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిదిగా మారిపోతుంది.
విజయవాడ, జూలై 20: రాష్ట్రంలో సెప్టెంబర్లో విలేజ్ మాల్స్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. కేరళ మంత్రి బృందంతో చర్చల అనంతరం ఆయన వెలగపూడి సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ తొలిదశలో 6 వేల విలేజ్ మాల్స్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రతిపాదన (ఆర్ఎఫ్పి)లను ఆహ్వానించామని తెలిపారు.
నంద్యాల, జూలై 20: త్వరలో జరుగనున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించి ముందుకుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నంద్యాల ఉప ఎన్నికలో పనిచేసేందుకు 25 మంది ఎమ్మెల్యేలు ఈనెల 25వ తేదీ నాటికి నంద్యాలకు చేరుకొనే అవకాశం ఉందని టిడిపి వర్గాలు అంటున్నాయి.
విశాఖపట్నం, జూలై 19: విశాఖ భూ కుంభకోణాన్ని దర్యాప్తు జరిపేందుకు నియమించి సిట్ అధికారులు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. సిట్కు ఇప్పటికే దాదాపూ 2600 ఫిర్యాదులు అందాయి. వీటిలో మెజార్టీ ఫిర్యాదులు అధికార పార్టీ నేతలపైనే. ఇప్పటి వరకూ వచ్చిన ఫిర్యాదులన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి, అతని బంధువులతోపాటు, అధికార పార్టీ సీనియర్ నేతలపైనే ఉన్నాయి.
విశాఖపట్నం, జూలై 19: విశాఖ భూ కుంభకోణాలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల కబ్జాలు, దురాక్రమణలు, క్రయ, విక్రయాలకు సంబంధించి నిరభ్యంతర సర్ట్ఫికెట్ల (ఎన్ఓసి) జారీపై కూడా సిట్ దర్యాప్తు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పుడు పలు ప్రభుత్వ శాఖలు తమ భూముల దురాక్రమణలపై సిట్కు నివేదికలు ఇస్తున్నాయి.
చింతూరు, జూలై 19: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో శబరి నది సహా, అనుబంధ వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో తూర్పు గోదావరిలో వీలీనమైన చింతూరు, విఆర్పురం మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోకిలేరు, చంద్రవంక, జల్లివారిగూడెం, కుయిగూరు, చీకటి వాగులు పొంగి పొర్లుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు బుధవారం జలదిగ్బంధం చేశాయి.