S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/18/2017 - 03:48

అమరావతి, జూన్ 17: ‘రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా మనం వేల కోట్లు ఖర్చు చేసి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం. అయినా ప్రజల్లో సంతృప్తి పెరగడం లేదు. నేనేమో పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని నిరంతరం కష్టపడుతుంటే మీరేమో నిరంతరం గొడవలు, వివాదాల్లో మునిగిపోతున్నారు. ఇలాగైతే ఇక నేనే కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. పనిచేయని వారికి మళ్లీ టికెట్లు ఇచ్చే సమస్యేలేదు.

06/18/2017 - 03:43

ప్రత్తిపాడు, జూన్ 17: రైతులను నష్టపెడితే పతనమైపోతారని, అటువంటి ఆలోచనల నుండి బయటపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ మేరకు ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ సిఎంకి తాను రాసిన లేఖ ప్రతులను విడుదల చేశారు.

06/18/2017 - 03:42

కాకినాడ, జూన్ 17: పన్నుల సంస్కరణల్లో భాగంగా జూలై 1వ తేదీ నుండి అమలుకానున్న జిఎస్‌టి విధానం వలన ప్రారంభంలో తాత్కాలిక ఇబ్బందులెదురైనా, దీర్ఘకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

06/18/2017 - 02:26

విజయవాడ, జూన్ 17: పాలకుల నిర్లక్ష్యం.. ప్రజల అవగాహన రాహిత్యం.. వెరసి అపురూపమైన శిల్పసంపద శిథిలమవుతోంది. శ్రీశైలం తూర్పు ద్వారంగా పేరుగాంచిన ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎటు చూచినా శిథిల ఆలయాలు, విరిగిన శిల్పాలు, రూపుకోల్పోతున్న శాసనాలే కనిపిస్తున్నాయి.

06/18/2017 - 02:22

విజయవాడ, జూన్ 17: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తులకు గడువు ఎంతో శనివారం ముగిసింది. బదిలీ పరిధిలోకి వచ్చే ఒక లక్షా 62వేల 091 మందికి గాను విధిగా బదిలీ కావాల్సిన వారిలో 59వేల 568 మంది, రిక్వెస్ట్ బదిలీ కోసం 28వేల 625 మంది దరఖాస్తు చేసుకున్నారు.

06/18/2017 - 02:21

హైదరాబాద్, జూన్ 17: రాజధాని నిర్మాణం పేరుతో మరో 14 వేల ఎకరాలను సేకరించడం పట్ల వైఎస్‌ఆర్‌సిపి తీవ్రంగా వ్యతిరేకించింది. నీ భూ దాహం తీరదా..? ఇంకా 14 వేల ఎకరాలు కావాలా..? అంటూ సిఎం చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి పార్థసారథి నిప్పులు చెరిగారు.

06/18/2017 - 02:20

గుంటూరు, జూన్ 17: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు త్వరలోనే పాలక మండళ్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు వెల్లడించారు. శనివారం గుంటూరులో రాష్ట్ర టిడిపి కార్యాలయంలో పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ వివివి చౌదరితో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకమండళ్ల ఏర్పాటులో తెలుగుదేశం, బిజెపి స్థానిక నేతల మధ్య అంతరాలు ఏర్పడుతున్నాయని, సమన్వయంతో పరిష్కరిస్తామన్నారు.

06/18/2017 - 02:17

విశాఖపట్నం, జూన్ 17: నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వీటిప్రభావంతో కోస్తాలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. కోస్తాలో ఒక మోస్తరు నుంచి ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

06/18/2017 - 02:15

విశాఖపట్నం, జూన్ 17: విశాఖ భూ కుంభకోణంపై బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు శనివారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. గంటా శ్రీనివాసరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. విశాఖ భూముల కుంభకోణంలో అయ్యన్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ సిఎం చంద్రబాబుకు గంటా లేఖ రాశారు. అందులో ఈ భూ కుంభకోణంపై సిబిసిఐడి, సిఐడి విచారణ జరిపించాలని చంద్రబాబుకు సూచించారు.

06/18/2017 - 02:14

విజయవాడ, జూన్ 17: విజయవాడలోని నారాయణ, చైతన్య సహా దాదాపు 20 కార్పొరేట్ పాఠశాలల్లో శనివారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు జరిపాయి.

Pages