S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/27/2016 - 16:07

గుంటూరు: ఎపికి ప్రత్యేకహోదా సాధించేవరకూ తమ ప్రభుత్వం పోరాడుతుందని వ్యవసాయశాఖ మంత్రి పి.పుల్లారావు శనివారం తెలిపారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్‌కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడినా మంచిదేనన్నారు. హోదా సాధనకు ఎవరు ప్రయత్నించినా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

08/27/2016 - 12:11

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు పడనున్నాయి.

08/27/2016 - 12:04

తిరుమల: జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. తితిదే అధికారులు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. రెండ్రోజులుగా తిరుమలలోనే బస చేసిన పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి చేరుకుంటారు.

08/27/2016 - 11:48

అనంతపురం : నగరంలోని తపోవనంలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. చెత్త ఏరుకుంటుండగా ఈ ఘటనలో కమలమ్మ(28) తీవ్రంగా గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. కమలమ్మ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తుంది. ఉదయం 9గంటలకు చెత్తకుప్పలో ప్లాస్టిక్‌ డబ్బా ఏరుకుని అందులో ఉన్న మట్టి తీసేందుకు డబ్బాను రాతిబండపై కొట్టింది.

08/27/2016 - 06:34

ఆనందపురం (విశాఖ), ఆగస్టు 26: అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రి పేలడంతో భార్యాభర్తలు దుర్మరణం పాలైన సంఘటన విశాఖ రూరల్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆనందపురం మండలం వేమగొట్టిపాలెంలో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రికి ప్రమాద వశాత్తు నిప్పంటుకుని అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాసరి అప్పన్న (45), దాసరి లక్ష్మి (35) సజీవ దహనమయ్యారు.

08/27/2016 - 06:32

గుంటూరు, ఆగస్టు 26: ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు.. ఆప్షన్లు.. వైఎస్సార్ కాంగ్రెస్.. కాంగ్రెస్.. జనసేన.. తెలుగుదేశం/బీజెపి, వామపక్షాలు.. మీకు మద్దతిచ్చేది ఏ పార్టీకంటూ మొబైల్ ఫోన్ల ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాభిప్రాయ సేకరణకు కసరత్తు ప్రారంభించింది..

08/27/2016 - 06:30

మంగళగిరి, ఆగస్టు 26: గుంటూరుజిల్లా మంగళగిరిలోని ఎపిఎస్‌పి ఆరో బెటాలియన్ ప్రాంగణంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయ నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన చేశారు.

08/27/2016 - 06:29

విశాఖపట్నం, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంలో అధికారిక నివేదికలను పక్కన పెట్టి రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు బిజెపి అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్టు ఎపి బిజెపి అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు వెల్లడించారు.

08/27/2016 - 06:28

మంగళగిరి, ఆగస్టు 26: రాష్ట్రంలో వర్షాలు కురవాలని , పంటలు బాగా పండాలని ప్రార్థిస్తూ శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడురోజుల వరుణయాగం ప్రారంభమైంది.

08/27/2016 - 06:27

శ్రీశైలం, ఆగస్టు 26 : ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ మండపం, అక్కమహాదేవి అలంకరణ మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించగా వెయ్యిమందికి పైగా ముత్తయిదువులు పాల్గొన్నారు.

Pages