S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/12/2019 - 04:56

తిరుపతి: టాటా పవర్ సోలార్‌ను రెసిడెన్సియల్ రూఫ్‌టాప్ ద్వారా సంవత్సరానికి 5 కిలోవాట్లకు రూ. 50వేల వరకు ఆదా చేయవచ్చని టాటా పవర్ ఎండీ, సీఈఓ ప్రవీర్ సిన్హా అన్నారు. మంగళవారం తిరుపతి-రేణిగుంట రోడ్డులోని ఐఐటీ వద్ద రూఫ్‌టాప్ ప్రచారం ప్లెడ్జ్ఫ్‌ర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సౌరశక్తి స్వీకరణ ప్రయోజనాలను వివరిస్తూ తిరుపతిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

06/12/2019 - 01:41

ముంబయి, జూన్ 11: కోట్లాది రూపాయిల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంతో పాటు మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ముంబై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టిసారించింది.

06/12/2019 - 01:39

చిత్రం... బడ్జెట్ కసరత్తులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో
మంగళవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

06/12/2019 - 01:35

వాషింగ్టన్, జూన్ 11: భారత ప్రధాని మోదీతో త్వరలో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు దిగుమతి సుంకాల విషయంలో భారత్‌పై ఆరోపణాస్త్రాలు సంధించారు. అమెరికా దేశపు చిహ్నంలా పేరొందిన ప్రఖ్యాత హార్లీ డేవిడ్సన్ మోటారు బైక్‌లపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకం ‘ఆమోదింపదగ్గది కాదు’ అని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు.

06/12/2019 - 01:33

ముంబయి, జూన్ 11: వరుసగా మూడోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలకు తోడు బ్యాంకింగ్, లోహ, విద్యుత్ స్టాక్స్‌లో వాటాల కొనుగోళ్లు జోరుగా సాగడం మంళవారం మార్కెట్లకు ఊతమిచ్చింది.

06/11/2019 - 04:31

విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అమెజాన్ ప్రైమ్ ఇక మీదట ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుందని అమెజాన్ ఇండియా ప్రైమ్ మెంబర్ గ్రోత్ అండ్ ఎంగేజ్‌మెంట్ హెడ్ సుబ్బు ఫళనియప్పన్ తెలిపారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే హిందీలో ప్రైమ్ ప్రసారాలు చేస్తున్న అమెజాన్ ఇక మీదట అన్ని ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందన్నారు.

06/10/2019 - 23:16

రాజమహేంద్రవరం, జూన్ 10: కొత్త ప్రభుత్వం గోదావరి జలాల పారిశ్రామిక అవసరాలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. పారిశ్రామిక అవసరాలు, గతంలో కేటాయింపు, గోదావరి పారిశ్రామిక అవసరాలు తీర్చడం ద్వారా వచ్చే ఆదాయం, బకాయిలు తదితర అంశాలపై పరిశీలన చేపట్టింది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా త్వరితగతిన పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చడంపై కూడా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

06/10/2019 - 22:45

ముంబయి, జూన్ 10: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. ఐటీ స్టాక్స్ అధికంగా లాభపడ్డాయి. సెనె్సక్స్ 168.62 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 52.05 పాయింట్లు లాభపడి 11,900 మార్కును తాకింది.

06/10/2019 - 22:32

గాంధీనగర్, జూన్ 10: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను మరింత బలోపేతంగానూ, పోటీ తత్వంతోనూ పనిచేసేలా తీర్చి దిద్దాలని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఫెసిలిటేషన్ సెంటర్లు (సదుపాయాల కల్పన కేంద్రాలు) ఏర్పాటు చేయనుంది.

06/10/2019 - 04:38

న్యూఢిల్లీ: రాబోయే కేంద్ర బడ్జెట్‌లో కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపుపరిమితిని మూడు లక్షల రూపాయలకు పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ)ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. అలా చేయడం వల్ల దేశంలో వినిమయ సామర్ధ్యం, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

Pages