-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విశాఖపట్నం: ప్రఖ్యాత ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్స్ తన సరికొత్త మోడల్ ‘టీవీఎస్ రేడియన్’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 110 సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ టీవీఎస్ రేడియంట్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు కంపెనీ మార్కెటింగ్ వైస్ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
న్యూఢిల్లీ: బ్యాంకులకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను కూడా ఆర్బీఐ మార్చలేదు. ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమయ్యే కమిటీ రెపో రేట్లపై నిర్ణయాలను తీసుకుంటుంది.
ముంబయి, డిసెంబర్ 5: రెపో రేటును 6.50 శాతంగానే కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయం బుధవారం స్టాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. ఈవారం లాభాల బాటలో నడుస్తున్న సెనె్సక్స్ దూకుడుకు బ్రేక్ పడింది. 249.90 పాయింట్లు నష్టపోయిన సెనె్సక్స్ 35,884.41 పాయింట్లకు చేరింది. అదే విధంగా నిఫ్టీ కూడా 84.55 పాయింట్లు నష్టపోవడంతో 10,784.95 పాయింట్లకు పడిపోయింది.
వియన్నాలో విలేఖరులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఇరాక్ చమురు శాఖ మంత్రి తామిర్ అబ్బాస్ అల్ గద్భన్. సుమారు రెండు నెలలు డిమాండ్ లేక నష్టాలను ఎదుర్కొన్న ముడి చమురు ధర తిరిగి పుంజుకుంటున్నది. చమురు ఉత్పత్తి, అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కొంటున్న సంక్షోభం వంటి అంశాలపై తామిర్ అబ్బాస్ ఇరాక్ వాదనను, వ్యూహాన్ని
వెల్లడించారు.
చిత్రం..తామిర్ అబ్బాస్
సింగపూర్, డిసెంబర్ 5: వ్యాపారంలో వృత్తినిపుణులను తయారు చేసే సంస్థగా పేరొందిన బ్రిటీష్కు చెందిన ఒక వ్యాపార సంస్థ భారత్లోని సూక్ష్మ, చిన్నతరహా సంస్థల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మేరకు ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ), మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజస్ (ఎంఎస్ఎంఇ)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనుంది.
ముంబయి, డిసెంబర్ 5: గత రెండు నెలల కాలంగా నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) ఆర్థికంగా పుంజుకుంటున్న దృష్ట్యా ప్రస్తుతం వాటి ద్రవ్యలభ్యత కోసం సహకరించాల్సిన అగత్యం రిజర్వు బ్యాంకుకు లేదని ఆ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచా ర్య బుధవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఈమేరకు సెంట్రల్ బ్యాంకు కు ద్రవ్య లభ్యతపై ఓ ప్రత్యేక విధానాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు.
ముంబయి, డిసెంబర్ 5: కేంద్ర ప్రభుత్వంతో రిజర్వు బ్యాంకుకు ఉన్న ఘర్షణ వైఖరిపై వ్యాఖ్యానించేందుకు ఆ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నిరాకరించారు. గతంలో ఉపయోగించని ఆర్బీఐ చట్టంలోని సెక్షన్-7ను వినియోగించడం, అలాగే ఆర్థిక మూలధన ఫ్రేంవర్క్పై వస్తున్న ప్రతిపాదనలపై సైతం వివరణ ఇచ్చేందుకు అయన అంగీకరించలేదు. నెలవారీ సమీక్షా సమావేశానికి హాజరైన అనంతరం బ్యాంకు విధాన నిర్ణయాలపై విలేఖరులతో ఆయన మాట్లాడారు.
టోక్యో, డిసెంబర్ 5: జపాన్ బిజినెస్ టైకూన్ కార్లస్ గోసన్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. ఇప్పటికే తన ఆదాయాన్ని సరిగ్గా వెల్లడించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొంటూ గత 15 రోజులుగా జైలులో ఉన్న నిస్సాన్ కంపెనీ మాజీ చైర్మన్ కార్లస్పై మరో అభియోగం నమోదు కానుంది.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,040.00
8 గ్రాములు: రూ.24,320.00
10 గ్రాములు: రూ. 30,400.00
100 గ్రాములు: రూ.3,04,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,226.00
8 గ్రాములు: రూ. 25,808.00
10 గ్రాములు: రూ. 32,260.00
100 గ్రాములు: రూ. 3,22,600.00
వెండి
8 గ్రాములు: రూ. 330.80
న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలను నూటికి నూరు శాతం చెల్లిస్తానని వ్యాపారవేత్త విజయమాల్యా పేర్కొన్నారు. తనను రుణాలు ఎగవేసి పారిపోయిన వ్యక్తిగా కొన్ని మీడియా సంస్థలు, కొంథరు అసత్య ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మొత్తం తిరిగి చెల్లిస్తానని ఆయన మరోసారి ట్వీట్ చేశారు. రుణాలను చెల్లిస్తానని కర్ణాటక హైకోర్టు ఎదుట చేసిన ప్రతిపాదనపై ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు.