S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

08/21/2017 - 02:33

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేరువేరు సమాచార కమిషన్లకు ప్రధాన సమాచార కమిషనర్లను ఆరు వారాల్లో నియమించాల్సిందిగా ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశించి, వివరాల్ని దాఖలు చేయాలని సెప్టెంబర్ 21వ తేదీకి తదుపరి వాయిదా వేసింది.

08/19/2017 - 00:19

వినాయక చవితి సందర్భంగా ఏటా ఇళ్లలోను, కాలనీల్లోను చిన్నా పెద్దా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించుకోవడం ఆనవాయితీ. కొందరు మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోగా మరికొందరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను ఆర్భాటంగా ఏర్పాటు చేస్తున్నారు. మట్టి విగ్రహాలే పర్యావరణానికి మేలు చేస్తాయని అందరూ గ్రహించాలి.

08/18/2017 - 00:36

ఈ మధ్య బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ మూడు వేల రూపాయలు ఉంచాలని, నెలలో ఎటిఎంను మూడు లావాదేవీలకు పరిమితం చేయడం సామాన్య ప్రజలకు ఇబ్బందిగా వుంది. పేదలు, విద్యార్థులు తమ ఖాతాల్లో కొంత నిల్వ చేయాలనుకుంటారు.

08/15/2017 - 23:31

అధికారిక మధ్యంతర ఆర్థిక సర్వే ప్రకారం రాబోయే సంవత్సరం వృద్ధిపరంగా ఆశాజనకంగా ఉండదు. తొలుత భావించినట్లు స్థూల జాతీయోత్పత్తి 7 శాతం సాధించడం దుర్లభం. తక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువ. దాదాపు అన్ని రంగాలూ వృద్ధిలో నేల చూపులు చూడడమే ఇందుకు కారణం. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి చర్యలతో దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నట్లు నమ్ముతున్న ప్రభుత్వం ఈ గణాంకాలతోనైనా కళ్లు తెరవాలి.

08/15/2017 - 00:50

ఎగురవేయ్... ఎగురవేయ్ జాతీయ జెండా
సత్యధర్మ సూత్రాలను - శాంతి సౌఖ్య భావాలను
మేళవించి ముందుంచిరి ఎ

అదిగదిగో జయగీతం - జనగణమన సంగీతం
రవివర్యుని పదభరితం - మన దేశపు ఘన చరితం
గొంతెత్తి పాడగా - అరుణారుణ కాంతులీనగా ఎ

08/14/2017 - 00:53

‘దిగ్గజాల వల్ల సాధ్యం కానిది కోహ్లీ సేన సాధించింది’ అని మురిసిపోతున్నాడు క్రికెట్ కొత్త కోచ్ రవిశాస్ర్తీ. దశాబ్దాలుగా మన క్రికెట్ దిగ్గజాలు శ్రీలంకలో ఆ దేశాన్ని టెస్ట్‌మ్యాచ్‌లలో ఓడించలేకపోయారు. ప్రప్రథమంగా ఇప్పుడు కోహ్లీ సేన ఆ ఘనత సాధించిందని రవిశాస్ర్తీ మురిపెం! కానీ ఒక సంగతి ఆయన దాచిపెడుతున్నాడు. శ్రీలంకలో ఇప్పుడు ఆనాటి దిగ్గజాలు లేవు. ఉన్న వాళ్లంతా కొత్తవాళ్లు.

08/09/2017 - 00:03

రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడిచినా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీలను ఇప్పటికీ విభజించకపోవడం బాధాకరం. అయితే- వ్యవసాయ, ఆరోగ్య విశ్వవిద్యాలయాలను ఇప్పటికే విడగొట్టారు. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ ఇంకా ఉమ్మడిగా ఉండడంతో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భాషాభివృద్ధి కుంటుపడుతోంది. గ్రాంట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది.

08/07/2017 - 23:31

‘జమైకా చిరుత’గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెంబర్ వన్ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ తను పాల్గొన్న చివరి అంతర్జాతీయ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కి తన హుందాతనం ద్వారా ప్రతిష్టను చేకూర్చాడు. క్రీడాస్ఫూర్తికి పట్టం గట్టాడు. దశాబ్దంగా తనకు తిరుగులేని వంద మీటర్ల పరుగుపందెంలో మొదటిస్థానం సాధించలేకపోయినా, మూడో స్థానంతో సరిపెట్టుకున్నా, సంతృప్తికరంగా కెరీర్‌కి వీడ్కోలు పలకడం ఆయన హృదయ పరిపక్వతకు నిదర్శనం.

08/07/2017 - 00:48

భారతదేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లే. చైనా వస్తువుల విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి. భారత్‌నుండి -ఆంధ్రనుండి ఎర్ర చందనం కలప ఎగుమతి అవుతోంది.అమరావతి నిర్మాణానికి చైనా కాంట్రాక్టు పొందింది. పవిత్ర మానస సరోవరం, టిబెట్టును కైవసం చేసుకుంది. నేపాలు హిందు రాజ్యం మావోల భోజ్యమైంది. భూటాన్ హిమాచల్ ప్రదేశ్ నుండి భారత్‌కి బదిలీ చేయదల్చింది. భారత్‌పై పాక్‌ను ఉసిగొల్పింది చైనాయే.

08/04/2017 - 00:34

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలోని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి అడ్డాలుగా మారాయి. సామాన్య ప్రజానీకం తమ పనుల నిమిత్తం మండల, డివిజన్, జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే పైసలివ్వనిదే ఫైలు కదలదన్న ఆరోపణలున్నాయి. ఉద్యోగులకు చేతులు తడిపితేనే పని అవుతుందన్నది బహిరంగ రహస్యం.

Pages