-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
ఇస్లామాబాద్, జూన్ 29: కాశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద భారత దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయంటూ ఇక్కడి తాత్కాలిక డిప్యూటీ హైకమిషనర్ను కలిసి పాక్ తన నిరసన తెలిపింది. బుధవారం నికియల్ సెక్టార్లో భారత దళాల కాల్పుల్లో 22 ఏళ్ల పౌరుడు మృతి చెందాడు. డొతిల్లా గ్రామానికి చెందిన అబ్దుల్ వహాబ్ మృతి చెందాడని, మరో నలుగురు గాయపడ్డారని విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు.
బీజింగ్, జూన్ 29: సరిహద్దు సమస్యను అర్ధవంతంగా పరిష్కరించుకోవాలంటే సిక్కింలోని డోంగ్లాంగ్ నుంచి భారత్ తన సైనిక దళాలను వెనక్కితీసుకోవాలని చైనా గురువారం స్పష్టం చేసింది. సరిహద్దు సమస్యపై చర్చలకు దీన్ని ముందస్తు షరతుగా విధించింది. 1962లో జరిగిన యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ‘్భరత్ సైనిక దళాలు చారిత్రక పాఠాలు నేర్చుకోవాలి’అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లూకంగ్ తెలిపారు.
వాషింగ్టన్, జూన్ 29: సరకులు/మానవ (ఎయిర్ లిఫ్ట్) రవాణా చేసే అత్యాధునిక భారీ విమానం బోయింగ్ సి-17 జెట్ను భారత్కు విక్రయించేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ అమెరికా కాంగ్రెస్కు తన నిర్ణయాన్ని తెలియజేసింది. సరకులను మాత్రమే కాకుండా విపత్తు సమయాల్లో ప్రజలను కూడా పెద్దఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సి-17లో ఎన్నో ఆధునిక సౌకర్యాలున్నాయి.
బీజింగ్, జూన్ 28: ఉగ్రవాదంపై పోరు విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ ముందు వరసలో ఉందంటూ చైనా తన చిరకాల మిత్రదేశాన్ని గట్టిగా వెనకేసుకు వచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్, అమెరికాలు పాక్ను కోరిన ఒక రోజు తర్వాత చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని చైనా భావిస్తోంది.
బీరూట్, జూన్ 27: సిరియాలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న ఓ కారాగార వాసంపై అమెరికా సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడిలో దాదాపు 60మంది మరణించారు. అయితే జిహాదీలను లక్ష్యంగా చేసుకుని తాము ఈ దాడులు జరిపామని అమెరికా స్పష్టం చేసింది. దాడుల్లో 60 మంది మరణించిన విషయాన్ని మానవహక్కుల పరిరక్షణ సంఘం ధ్రువీకరించింది.
వాషింగ్టన్, జూన్ 27: ప్రపంచ శాంతిని కబళిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని భారత్-అమెరికాలు సమరశంఖం పూరించాయి. ఐసిస్, అల్ఖైదా, జైషే మొహమ్మద్, డి-కంపెనీలను వదిలేది లేదంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాయి. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టి పెట్టండి. మీ భూభాగాన్ని అందుకు వేదిక కానివ్వకుండి’అంటూ పాకిస్తాన్ను తీవ్ర స్వరంతో హెచ్చరించాయి.
వాషింగ్టన్, జూన్ 27: ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలుసుకొన్నది తొలిసారే అయినప్పటికీ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనే విషయం వైట్హౌస్లో వారి భేటీలో చాలా స్పష్టంగా కనిపించింది. మోదీకి ట్రంప్ దంపతులు స్వాగతం చెప్పడం మొదలుకొని ఆయన హోటల్కు తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు పలికే దాకా కరచాలనాలు, ఆత్మీయ ఆలింగనాలు, పలకరింపులు.. ఇవన్నీ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాయి.
వాషింగ్టన్, జూన్ 27: ఇకపై అమెరికా వెళ్లే సాధారణ భారతీయులు విమానాశ్రయంలో దిగిన తర్వాత కేవలం అయిదు, పది నిమిషాల్లోనే ఆ దేశంలోకి అడుగుపెట్టవచ్చు. అమెరికా చేపట్టిన గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్లోకి భారత్ను అధికారికంగా చేర్చుకోవడంతో ఇందుకు మార్గం సుగమం అయింది.
వాషింగ్టన్, జూన్ 27: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా హెచ్1బి వీసాలకు సంబంధించి ట్రంప్ నుంచి హామీని పొందుతారని ఎదురుచూసిన మన దేశ ఐటి నిపుణులకు నిరాశే మిగిలింది. ట్రంప్తో జరిగిన భేటీలో మోదీ హెచ్1బి వీసాలకు సంబంధించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత హెచ్1బి వీసాల నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే.
అమ్స్టెర్డం, జూన్ 27: ఆర్థిక అభివృద్ధిలో నెదర్లాండ్స్తో భారత్కు సహజసిద్ధమైన భాగస్వామ్యం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని అమ్స్టెర్డం చేరుకున్న నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ ర్యూట్తో విస్తృత చర్చలు జరిపారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, పునర్వినియోగ ఇంధన అభివృద్ధిలో మరింతగా సహకరించుకోవాలని ఇరువురు ప్రధానులు సంకల్పించారు.