-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
ఝార్ఖండ్ : రామ్గఢ్ జిల్లాలో పోలీసులు, స్థానికులకు మధ్య మంగళవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు. గోలాలోని పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్థులుఎదుట ఆందోళన చేపట్టారు. ఓ వర్గం గ్రామస్థులు ప్లాంట్ యాజమాన్యంతో చర్చలు జరుపుతుండగా, మరో వర్గం వారు అల్లర్లకు పాల్పడ్డారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వడాన్ని సవాల్ చేస్తూ గ్రీన్ ట్రిబ్యునల్లో దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణ సెప్టెంబర్ 5కి వాయిదాపడింది. ఒడిశాకు చెందిన ధరిలింగా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం గ్రీన్ ట్రైబ్యునల్లో విచారణకు వచ్చింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఓటుకు నోటు కేసు విచారణను త్వరగా పూర్తి చేసి దోషులకు తగిన శిక్ష విధించాలని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. ఈ కేసు ఆలస్యానికి కారణం కేవలం రాజకీయ స్వార్థమేనని ఆయన విమర్శించారు. సోమవారం నారాయణ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ అన్ని పార్టీలతో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో తాను పాల్గొన్నట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: జమైకా అథ్లెట్ ఉసేయిన్ బోల్టు ఒలింపిక్స్లో 9 బంగారు పతకాలను సాథించడానికి కారణం.. గొడ్డు మాంసం తినాలని అతడి కోచ్ సలహా ఇవ్వడమేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బిజెపి ఎంపీ, దళిత నాయకుడు ఉదిత్ రాజ్ కలకలం సృష్టించారు. ఆయన వ్యాఖ్యలపై బిజెపితో పాటు వివిధ వర్గాలకు చెందిన నేతలూ విరుచుకుపడ్డారు. దాంతో తప్పుతెలుసుకున్న ఉదిత్ వివరణ ఇచ్చారు.
న్యూఢిల్లీ,ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్ నుతన రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దాఖలైన పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం నాడు గ్రీన్ట్రిబ్యునలోని జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: రెండో వ్యూహాత్మక చర్చల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సోమవారం భారత పర్యటనకు వచ్చారు. మంగళవారం జరిగే చర్చల్లో ఉగ్రవాదం సహా ఇరు దేశాలకు సంబంధించిన అనేక ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా వాణిజ్య మంత్రి పెన్నీ ప్రిట్జ్కెర్లు పాల్గొంటారు.
కోల్కతా, ఆగస్టు 29: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్పును అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఇంగ్లీష్లో బెంగాల్గా, బెంగాలీలో బంగ్లాగా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. పేరు మార్పును ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి, లెఫ్ట్ఫ్రంట్ను వ్యతిరేకించాయి. పేరు మార్పు తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి పార్థ చటర్జీ 169వ నిబంధన కింద సభలో ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: జమ్మూకాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అధ్యయనం చేసేందుకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిల పక్షం సెప్టెంబర్ నాలుగో తేదీ రాష్ట్ర రాజధాని శ్రీనగర్కు వెళుతోంది. అఖిల పక్షం అవసరమైతే రెండు మూడు రోజులు శ్రీనగర్లోనే ఉండి వీలున్నంత ఎక్కువ మందితో చర్చలు జరుపుతుందని అంటున్నారు.
నాగపూర్, ఆగస్టు 29: దశాబ్దాలుగా తమ సిద్ధాంతాన్ని ప్రతిబింబించే విధంగా ఖాకీ నిక్కర్లతోనే దర్శనం ఇచ్చిన ఆర్ఎస్ఎస్, ఈ సంస్కృతికి స్వస్తి పలికింది. మారుతున్న కాలానికి అద్దం పడుతూ యూనిఫాంలోనూ మార్పులు తీసుకువచ్చింది. సోమవారం నుంచి ఈ కొత్త దుస్తుల విక్రయం ఇక్కడి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచే సోమవారం మొదలైంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: స్కార్పీన్ జలాంతర్గామికి సంబంధించిన రహస్య సమాచారం లీక్ కావడం పెద్దగా ఆందోళనకరమైన విషయమేమీ కాదని, అయినప్పటికీ దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని నావికాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సోమవారం స్పష్టం చేశారు. స్కార్పీన్ జలాంతర్గామి శక్తిసామర్ధ్యాలకు సంబంధించిన 22 వేల పేజీలకు పైగా సమాచారం బహిర్గతం కావడంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి.