-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
దుబాయ్, జనవరి 30: 2020లో జరిగే వరల్డ్ టీ-20 పురుషుల, మహిళల ఫైనల్ పోటీలకు ఆస్ట్రేలియాలో అతిపెద్దదైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక కాబోతోందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. మహిళల వరల్డ్ టీ-20 పోటీలు 2020 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకూ, పురుషుల టీ-20 పోటీలు అదే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకూ ఆస్ట్రేలియాలో నిర్వహిస్తారు.
న్యూఢిల్లీ, జనవరి 30: అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాక్ను మట్టి కరిపించి ఫైనల్కు చేరిన భారత యువ ఆటగాళ్లకు బీసీసీఐ నగదు పురస్కారాలు ఇచ్చి సన్మానించనున్నట్టు ప్రకటించింది. బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా మీడియాతో మాట్లాడుతూ క్రిస్ట్చర్చ్లో పాకిస్తాన్ను ఓడించిన భారత జట్టు సభ్యులను అభినందించాడు.
క్రైస్ట్చర్చ్, జనవరి 30: ఐసీసీ అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ సెమీఫైనల్స్లో భారత యువ జట్టు దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ను మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు ఆడిన వివిధ టోర్నీలలో భారత్ ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా దూకుడు ప్రదర్శించి ఆరోసారి ఫైనల్కు చేరింది. మంగళవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్స్లో ప్రత్యర్థి టీమ్ను 69 పరుగులకే కుప్పకూల్చింది.
చండీఘర్, జనవరి 30: పాకిస్తాన్తో మంగళవారం జరిగిన అండర్-19 సెమీఫైనల్స్లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు యువ ఆటగాళ్లను పంజాబ్ కేబినెట్ మంత్రి, ప్రసిద్ధ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభినందించాడు. చిరకాల ప్రత్యర్థిని అతి తక్కువ స్కోరుకే ఔట్ చేయడమే కాకుండా 203 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్కు చేరుకోవడం అనిర్వచనీయమని అన్నాడు.
చండీగఢ్, జనవరి 30: అండర్-19 భారత క్రికెట్ జట్టుకు శుభ్మాన్ గిల్ ప్రాతినిధ్యం వహించడం తనకెంతో గర్వంగా ఉందని తండ్రి లఖ్విందర్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. క్రికెట్ పట్ల ఉన్న అంకితభావం వల్లనే తన కుమారుడు ఇంతటి ఘనతను సాధించాడని ఆయన మంగళవారం విలేఖరులతో చెప్పారు. న్యూజిలాండ్లో జరుగుతున్న అండర్- 19 ప్రపంచ కప్ పోటీలో తన కుమారుడు అద్భుత నైపుణ్యం ప్రదర్శించడం దేశానికే గర్వకారణం అన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 30: పాక్తో మంగళవారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో తన అద్భుత ఆటతీరుతో, అత్యధిక స్కోరుతో జట్టును విజయపథాన నిలిపిన యువ సంచలనం శుభ్మాన్ గిల్పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ యువ బ్యాట్స్మన్ అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ ఇప్పటివరకు 341 పరుగులు చేశాడు. ఈ యువ క్రికెటర్ ఇపుడు అందరి నోళ్లలో నానుతున్నాడు.
క్వీన్స్టన్, జనవరి 30: క్వీన్స్టన్ ఈవెంట్ సెంటర్లో మంగళవారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 261 పరుగులు చేయగా, లక్ష్యసాధనకు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 229 పరుగులు మాత్రమే చేయగలిగింది.
న్యూఢిల్లీ, జనవరి 30: త్వరలో జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు వివిధ ఫ్రాంచైజీలు దక్కించుకున్న క్రికెటర్లలో అత్యధిక శాతం మందిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఈ సీఎస్కే జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించనుండగా, డిప్యూటీ కెప్టెన్గా సురేష్ రైనా వ్యవహరిస్తాడు. 2010, 2011లలో ధోని సారధ్యంలోని జట్టు టైటిల్ను దక్కించుకున్న విషయం తెలిసిందే.
క్రైస్ట్చర్చి, జనవరి 29: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఫైనల్కు దూసుకెళ్లింది. జాక్ ఎడ్వర్డ్స్ బ్యాటింగ్ ప్రతిభకు, బౌలింగ్ విభాగం మద్దతుగా నిలవడంతో అఫ్గానిస్థాన్ను ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. ఈ టోర్నీలో ఎవరూ ఊహించని రీతిలో దూసుకెళుతున్న అఫ్గాన్కు ఆసీస్ సమర్థంగా బ్రేక్ వేయగలిగింది.
మెల్బోర్న్, జనవరి 29: ఇంకా ఎంతకాలం టెన్నిస్ ఆడతానో, కెరీర్ను కొనసాగిస్తానో తనకే తెలియదని ఆస్ట్రేలియా ఓపెన్ విజేత రోజర్ ఫెదరర్ వ్యాఖ్యానించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 36 ఏళ్ల ఈ స్విట్జర్లాండ్ వీరుడు 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో మారిన్ సిలిక్ను ఓడించిన విషయం తెలిసిందే. సంప్రదాయం ప్రకారం సోమవారం అతను గవర్నమెంట్ హౌస్ వద్ద ఫొటోలకు ఫోజులిచ్చాడు.