S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/30/2017 - 02:18

హైదరాబాద్, నవంబర్ 29: విశాఖపట్నం నగరం ద్వారా వెళ్లే జాతీయరహదారి-16 భాగాన్ని మినహాయించినప్పుడు , నగరంలోని టోల్ ఫ్లాజా వాహనాల నుంచి ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ హైకోర్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ప్రశ్నించింది.

11/30/2017 - 02:02

హైదరాబాద్, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార పార్టీ టిడిపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై ఉన్న క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్ కేసులో హైకోర్టు ధర్మాసనం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం, ఏపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

11/30/2017 - 02:01

హైదరాబాద్, నవంబర్ 29: పదవ తరగతి చదువుతున్న బాలికలకు ‘మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ 2018’ను డిసెబంర్ 10న నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎండి నారా భువనేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడేళ్లగా నిర్వహిస్తున్న ఈ పరీక్షను గండిపేటలోని ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

11/30/2017 - 02:00

హైదరాబాద్, నవంబర్ 29: తార్నా క రైల్వే జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న మాస్టర్ యశ్ వర్మకు జాతీయ స్కూల్ గేమ్స్‌లో మెడల్స్ గెలుచుకున్నాడు. ఈ నెల 26 నుంచి 30 వరకు ఢిల్లీలో నిర్వహించిన 63వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 400 మీటర్ల ఇండివిడ్యువల్ మెడ్‌లేలో బంగారు పతకం, 200 మీటర్ల బట్టర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో బ్రోంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.

11/30/2017 - 01:51

హైదరాబాద్, నవంబర్ 29: హైదరాబాద్ నగరానికి పెట్టుబడులతో రావాలని తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామారావు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అత్యంత స్నేహపూరితమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, అనుమతులపై దేశంలో ఎక్కడాలేని కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.

11/30/2017 - 01:46

వరంగల్, నవంబర్ 29: వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ సమీపంలో వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి బాధితురాలిని తరలించారు. అయతే, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

11/30/2017 - 01:45

రేణిగుంట, నవంబర్ 29: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని గాజుల మండ్యం పారిశ్రామికవాడలోని మల్లాది డ్రగ్స్ కంపెనీలోని ప్లాంట్-ఏలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించి కెమికల్ రేడియేటర్ పేలింది. నాలుగు అంతస్థుల భవనంలోని రెండవ అంతస్థులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు ప్లాంట్‌లో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం.

11/30/2017 - 01:43

అమరావతి, నవంబర్ 29: ‘హైదరాబాద్ అభివృద్ధిలో మా ముద్ర పోయేది కాదు. మెట్రోతోపాటు జీఈఎస్ జరుగుతున్న హెచ్‌ఐసిసి వేదిక, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, సైబరాబాద్ ఇవన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. మెట్రోరైల్‌ను నేను ప్రారంభించినా, ప్రారంభించకున్నా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్న సంతృప్తి ఉంది’ అని ఏపీ సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

11/30/2017 - 01:37

విజయవాడ, నవంబర్ 29: ఇక ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య జరిగినా సహించేది లేదు. కళాశాల యాజమాన్యం ఎవరిదైనా వారిని ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తప్పవని సిఎం చంద్రబాబు సభాముఖంగా హెచ్చరించారు. అసెంబ్లీలో బుధవారం ‘విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యల’పై దాదాపు గంటసేపు చర్చ జరిగింది. దీనిపై సిఎం సమాధానమిస్తూ స్వప్రయోజనాల కోసం ర్యాంకుల పేరిట విద్యార్థులను మరయంత్రాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

11/29/2017 - 04:26

హైదరాబాద్, నవంబర్ 28: మెట్రోరైలు, గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించగా, అదేస్థాయిలో రాత్రి పది గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలు లభించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున బేగంపేట విమానాశ్రయాన్ని అందంగా అలంకరించగా, ప్రధానికి అట్టహాసంగా స్వాగతం లభించింది.

Pages