-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 11: విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న ప్రతిబంధకాలు ఒక్కొక్కటి తొలుగుతున్నాయి. త్వరలో అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ పేరిట ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడలో 26.03 కి.మీ పొడువున రెండు కారిడార్ల నిర్మాణానికి రూ. 3600 కోట్ల రుణం మంజూరు చేసేందుకు జపానీస్ ఇంటర్నేషనల్ ఏజన్సీ (జైకా) ముందుకు వచ్చింది.
హైదరాబాద్, డిసెంబర్ 11: జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలను చేపట్టాలని జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సమీక్షించాలని దాఖలైన పిటిషన్పై తీర్పును రిజర్వు చేసినట్లు హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. హైకోర్టు విభజన జరిగే వరకు న్యాయాధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి దాఖలు చేసిన పిల్ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది.
రాజమండ్రి, డిసెంబర్ 11: బిసి జాబితాలో చేర్చాలనే కాపుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రకటించారు. కేవలం మద్దతివ్వడమేకాక, ఇదే డిమాండుతో కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమిస్తుందన్నారు. దీనికోసం జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేస్తామన్నారు.
గుంటూరు,డిసెంబర్ 11: నరసరావుపేట పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న డిఎస్సీ-2014 నిరుద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ వాతావరణంలో కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొద్దిమంది, ఐదారుగురు స్వార్ధపరులు వాతావరణాన్ని కలుషితం చేయాలనే ఉద్దేశంతో ప్లకార్డులు ప్రదర్శించడం సరికాదన్నారు.
విశాఖపట్నం, డిసెంబర్ 11: ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన విశాఖ నగరానికి పర్యాటకుల తాకిడి గణనీయంగా తగ్గింది. గత ఏడాది హుదూద్ తుపానులో విశాఖ జిల్లాలోని అందమైన ప్రదేశాలన్నీ కనుమరుగయ్యాయి. వాటిలో చాలా వరకూ ఇప్పటి వరకూ పునరుద్ధరణకు నోచుకోలేదు. అంతకు ముందు రెండేళ్లు కూడా పర్యాటక శాఖకు చెందిన ఉద్యోగులు పర్యాటక సీజన్ ప్రారంభమయ్యే సెప్టెంబర్లో సమ్మెకు దిగారు.
విజయవాడ, డిసెంబర్ 11: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన విజయవాడ నగరంలో శనివారం దక్షిణాది రాష్ట్రాల 26వ కౌన్సిల్ సమావేశం జరుగబోతున్నది. విజయవాడ నగరంలో ఇలాంటి సమావేశం జరగటం ఇదే ప్రప్రథమం కావటంతో అధికార యంత్రాంగం హాజరుకానున్న ప్రతినిధుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజమండ్రి, డిసెంబర్ 11: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో రైతుల అంగీకారం లేకుండా ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటోందని, ఇలాంటి విధానాన్ని తమ పార్టీ అడ్డుకుంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు మరింత తీవ్రంగా దెబ్బతీశాయని, వివిధ రంగాలకు 3759.97 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఇతోధికంగా సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తిరుచానూరు, డిసెంబర్ 11 : శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నాల్గవరోజైన శుక్రవారం ఉదయం అమ్మవారికి కల్పవృక్ష వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. అమ్మవారు మన్నార్ రాజగోపాలుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నిత్యకైంకర్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారిని వాహన మండపంలో వేంచేపు చేసి కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పట్టు పీతాంబరాలు, స్వర్ణ్భారణాలతో శ్రీకృష్ణుడిగా అలంకరించారు.
విజయవాడ, డిసెంబర్ 11: ఐదుగురిని బలిగొన్న విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్ రెస్టారెంట్లోనే మద్యం కల్తీ జరిగినట్లుగా ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా 28 మంది తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. వీరందరూ సేవించిన మద్యం బ్రాండ్లను రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసి వాటి శాంపిల్స్ను గుంటూరులోని ప్రాంతీయ ల్యాబ్కు, హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించటం జరిగింది.