-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
రాజమహేంద్రవరం, జూలై 26: ఉప్పొంగే గోదావరి ఉప్పు జలాల పాలవుతోంది. ఏటికేడాది లక్షలాది క్యూసెక్కుల జలాలు వృథాగా సముద్రం దారిపడుతున్నాయి. రబీలో జలాల కోసం వెంపర్లాడే పరిస్థితిని బట్టి వరద జలాలను దాచుకోడానికి లేదు. ఎందుకంటే కాటన్ బ్యారేజి వద్ద ఎఫ్ఆర్ఎల్ సామర్ధ్యం 3.18 టీఎంసీలు మాత్రమే. ఆపై వచ్చే జలాలన్నీ సముద్రం పాలవ్వాల్సిందే.
ధర్మపురి, జూలై 26: చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళరేఖలో ఉన్నపుడు చంద్రునికి, సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణ కాలం చంద్రుని స్థాన కక్ష్య్యా బిందువులపై ఆధార పడి ఉంటుం ది. భూమిపై ఉండే వారికి చంద్రగ్రహణం కనపడితే, చంద్రుని పైనుం డి వీక్షిస్తే సూర్య గ్రహణం కనపడుతుంది. ఇది ‘పౌర్ణమి’నాడే కలుగుతుంది.
హైదరాబాద్, జూలై 26: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యశ్వంత్పూర్ - విశాఖపట్నంల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడిపాలని దక్షణ మధ్య రైల్వే నిర్ణయించింది. 06579/06580 నెంబర్లు గల ట్రైన్లు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనున్నాయి.
తిరుపతి, జూలై 26: ఏడుకొండల వెంకన్నకు టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా బుధ, గురువారాల మధ్య రూ.6.28 కోట్లు ఆదాయం లభించింది. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు, గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వచ్చిన కానుకలను లెక్కించారు.
రేణిగుంట, జూలై 26: తెలుగు రాష్ట్రాల్లో తనకు ఏ పార్టీతో ప్రమేయం లేదని, అయితే ఏ పార్టీ ప్రజలకు మంచి చేస్తుందో ఆ పార్టీ నాది అని, ఎవరు మంచి చేస్తే వారి వెనుక నిలబడతానని పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు.
చిత్తూరు, జూలై 26: యుద్ధ విమానాలు కొనుగోలు సుమారు 40వేల కోట్లు కుంభకోణం జరిగినట్లు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్చాందీ ఆరోపించారు. గురువారం చిత్తూరులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోదీ దేశరక్షణ వ్యవహారాల్లో సైతం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కరీంనగర్, జూలై 26: రహదారులపై లారీల రాకపోకలు నిలిచిపోయి ఆరు రోజులు గడిచింది. ఏడవ రోజు అడుగిడుతోంది. లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయి సరుకుల రవాణాపై ప్రభావం చూపుతుండగా, సామాన్యులకు క్రమేణా కష్టాలు పెరుగుతున్నాయి. సమ్మె ప్రభావంతో నిత్యావసర ధరలు మోత మోగిస్తున్నాయి. సమ్మె ఇలాగే కొనసాగితే ధరలు మరింత దరువేసే అవకాశాలున్నాయి. పెట్రోల్ బంక్లు ఒక్కక్కటిగా నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తర్వాత పొలిటికల్ సీన్ మారిపోయిది. ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరైతే,
సింహాచలం, జూలై 26: ఆషాఢ పౌర్ణమి ఉత్సవంలో భాగంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో జరిగే సింహగిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే భక్తులు లక్షలాదిగా తరలివచ్చి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు జెండా ఊపి గురువారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు రథ ప్రదక్షిణను అధికారికంగా ప్రారంభించారు.
కాళ్ల, జూలై 26: సామాజిక, రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చకపోతే గూండాలు, ఫ్యాక్షనిస్టులు రాజ్యమేలతారని, ఈ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని జనసేనాధినేత పవన్కళ్యాణ్ స్పష్టం చేశారు. నిస్వార్థంగా సేవలందించే వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలన్నారు. రాజకీయాలు చేయాలంటే పెట్టి పుట్టక్కరలేదని సేవాగుణం, ధైర్యం, తెగింపు, సహనం ఉంటే చాలన్నారు.