-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, జూన్ 30: మిషన్ భగీరథ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయని వర్క్ ఏజెన్సీ కాంట్రాక్ట్ రద్దు చేసేందుకు కూడా వెనుకాడమని తెలంగాణ సిఎం కెసీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భగీరథ ప్రాజెక్టు పూర్తి చేయడంలో జాప్యా న్నీ, నిర్లక్ష్యాన్నీ ఎట్టిపరిస్థితిలో సహించేది లేదని అన్నారు.
మంత్రాలయం, జూన్ 30: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి దంపతులు శనివారం సాయంత్రం వచ్చారు. మంత్రాలయం చేరుకున్న నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధా నారాయణమూర్తి ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్, జూన్ 30: హైదరాబాద్ ఫార్మా హబ్గా రూపొందినట్టు ఐటీ మంత్రి కే. తారకరామారావు చెప్పారు. శనివారం నాడు ఆయన జీనోమ్ వ్యాలీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫెర్రింగ్ ఫార్మాస్యుటికల్స్ సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో ఉన్నతస్థానంలో ప్రభుత్వం చేర్చిందని చెప్పారు.
పాల్వంచ, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలో తొలివెలుగులు విరజిమ్మాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంకురార్పణం జరిగిన మొదటి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభమైంది.
కడప, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రంటే కేంద్రానికి చులకనై పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది, మాకు సహకరిస్తే మేమూ సహకరిస్తాం.. లేదా పోరాడుతాం.. ఏం చేస్తారో చేసుకోండి’ అని విరుచుకుపడ్డారు.
కాకినాడ, జూన్ 30: పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం తనను కలసిన విలేఖరులతో యనమల మాట్లాడారు.
హైదరాబాద్, జూన్ 30: ధైర్యం ఉంటే తనపై పోటీచేసి గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మజ్లీస్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పోటీకి కూడా తాను సిద్ధంగానే ఉన్నానని అన్నారు. శనివారం తన మద్దతుదారులతో హైదరాబాద్లో ఆయన భారీ ఊరేగింపు నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 30: క్రీడా కోటా లో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరేందుకు షెడ్యూలు ఖరారైంది. ఎమ్సెట్ ఎంపీసీ స్ట్రీం స్పోర్ట్సు కేటగిరి కౌనె్సలింగ్ షెడ్యూలును కూడా సిద్ధం చేశారు. అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈనెల 5వ తేదీ నుండి ఉద యం 9 నుంచి సాయంత్రం 3 వరకూ ఒకటవ ర్యాంకు నుండి తుది ర్యాంకు వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్లు జరుగుతాయి.
నిజామాబాద్, జూన్ 30: దిగువ గోదావరిలో జలకళకు ప్రధాన అవరోధంగా మారిన ‘బాబ్లీ’ బంధనం తాత్కాలికంగా వీడనుంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ నేడు బాబ్లీ గేట్లను తెరువనుండగా, వరద జలాలు దిగువ గోదావరిలోకి పరుగులు పెట్టనున్నాయి. నిజామాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అక్టోబర్ 28వ తేదీ వరకు తెరిచి ఉంచనున్నారు.
హైదరాబాద్, జూన్ 30: ‘సంస్థాగతంగా బలపడదాం...ముందస్తుకు సిద్ధమని ముందు నిలబడదాం..’ అని టీపీసీసీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయించారు.