S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/09/2018 - 04:14

* తెలుగు రాష్ట్రాల మధ్య తగ్గని దూరం * ఏపీలో ఆర్థిక మంత్రుల భేటీకి తెలంగాణ డుమ్మా
* ఓటుకు నోటును తెరపైకి తెచ్చిన తెలంగాణ * ఫ్రంట్‌పై చంద్రబాబుతో మాట కలపని కేసిఆర్

05/09/2018 - 01:57

న్యూఢిల్లీ, మే 8: సుప్రీంకోర్టులో మంగళవారం అనూహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించాలంటూ ఇచ్చిన నోటీసును రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకుని అందరిని ఆశ్చర్యంలో పడవేసింది.

05/09/2018 - 01:56

విజయవాడ, మే 8: రాష్ట్రంలో సింగపూర్ తరహాలో నైట్ సఫారీలను అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఏనుగులు, కోతుల బెడదను అరికట్టేందుకు వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ తిరుపతి, విశాఖ నగరాల్లో నైట్ సఫారీలు, అమరావతిలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

05/08/2018 - 17:15

హైదరాబాద్:రాజకీయ కక్షసాధింపుల కోసం కేసీఆర్ దృష్టిపెట్టారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ బంధువైతే చాలు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నా ఫరవాలేదు అని ఎద్దేవా చేశారు. మోదీ-కేసీఆర్ ఆడుతున్న భాగంలోనే ఈ ఓటుకు నోటు కేసు అని ఆయన అన్నారు.

05/08/2018 - 17:14

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేయటంతో ఈ కేసులో కీలకవ్యక్తి అయిన మత్తయ్య మీడియా ముందుకు వచ్చారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ..నా తమ్ముడు బంధువులను కొట్టించటంపై దర్యాప్తు జరపాలని మత్తయ్య డిమాండ్ చేశారు. నేను కోవర్ట్‌గా మారనందుకు నన్ను బెదిరించారు. ఓటుకు నోటు కేసును పునఃసమీక్ష చేసినందుకు సంతోషమని ఆయన అన్నారు. కుట్రపూరితంగా కేసు పెట్టించి నన్ను ఏ4గా చేర్చారు.

05/08/2018 - 17:12

హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు వేలమందికి పైగా రైతులు చనిపోతే ఏ ఓక్కరికి సాయం చేయలేదని అన్నారు. రైతుబంధు అంటే రైతుకు సంకెళ్లు వేయటమా అనే నినాదంతో రూపొందించిన గోడపత్రకను ఆయన విడుదల చేశారు.

05/08/2018 - 14:10

అమరావతి: కేసులకోసం ఆత్మగౌరవాన్ని మోదీకి జగన్ తాకట్టు పెట్టారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ 12 కేసుల్లో ఏ వన్ గా ఉన్న వ్యక్తి చంద్రబాబును విమర్శించడం దారుణమని విమర్శించారు. బీజేపీ నేతలు బరితెగించి ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతున్నారని విమర్శించారు.

05/08/2018 - 13:17

అమరావతి: 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణ భారతానికి పార్లమెంట్ సీట్లు తగ్గిపోయే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మంగళవారంనాడు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ విభజనతో సమస్యల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకరించకుండా పోయిందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటి మీద సమాన దృష్టి పెట్టిందని అన్నారు.

05/08/2018 - 05:55

హైదరాబాద్, మే 7: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా ప్రధాని నరేంద్రమోదీని అప్రతిష్టపాల్చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రంలోని గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రాల అభివృద్ధికి కేటాయించిన ప్రాజెక్టులు, నిధులు గత నాలుగేళ్లలో మంజూరు చేసిన అభివృద్ధి పనులపై చర్చకు తాము సిద్ధమని, అందుకు రెండు రాష్ట్రాలూ సిద్ధమా అని లక్ష్మణ్ సవాలు విసిరారు.

05/08/2018 - 05:52

హైదరాబాద్, మే 7: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మరింత తగ్గేలా ఉంది. గత ఏడాది మేనేజిమెంట్ కోటా, ఇతర మైనార్టీ కాలేజీల్లోని సీట్లు 1,24,239 కాగా ఈ ఏడాది ఈ సీట్ల సంఖ్య 1,10,117కు తగ్గనున్నాయి. గత ఏడాది కన్వీనర్ కోటా సీట్లు 87 వేలు కాగా, ఈ ఏడాది కన్వీనర్ కోటా 80 వేల కంటే తక్కువ కానున్నాయి. 14 కాలేజీలకు ఈ ఏడాది ఎఐసిటీఇ అనుమతి నిరాకరించింది.

Pages