S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/30/2017 - 00:55

హైదరాబాద్, జూన్ 29: కొత్తగూడెం థర్మల్ ప్లాంట్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులన ప్రతులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం ఇక్కడ ఉద్యోగులకు అందచేశారు.

06/30/2017 - 00:55

హైదరాబాద్, జూన్ 29: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ వ్యయంను పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్ వ్యయం ఐదులక్షల నాలుగు వేల రూపాయలు, అర్బన్ ప్రాంతాల్లో ఐదులక్షల 30వేల రూపాయలు. జిహెచ్‌ఎంసి పరిధిలో గ్రౌండ్ + మూడు అంతస్థుల వరకు యూనిట్ వ్యయం ఐడు లక్షల రూపాయలు. తొమ్మిదవ అంతస్థుకు ఏడు లక్షల 90వేల రూపాయల వ్యయంగా నిర్ణయించారు.

06/30/2017 - 00:54

హైదరాబాద్, జూన్ 29: బ్యూటీషియన్ శిరీష మృతిపై పోలీసులకు ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమిక నివేదిక అందింది. ఈనెల 12 శిరీష ఆత్మహత్య అత్మహత్య కేసును బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమిక నివేదిక అందుకున్న పోలీసులు శిరీషపై అత్యాచారం జరగలేదని తేలిందని గురువారం మీడియాకు తెలిపారు.

06/30/2017 - 00:54

హైదరాబాద్, జూన్ 29: కేంద్రం జాతీయ రహదారులను మంజూరు చేసినా అంచనాలు రూపొందించడానికి ఏడునెలల గడువు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగక పోవడంపై రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో ఐఆర్‌సి ప్లీనరీ సందర్భంగా నితిన్ గడ్కారి రాష్ట్రంలో ఐదు రహదారుల అభివృద్ధికి ఎనిమిదివేల కోట్ల రూపాయలతో అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు.

06/28/2017 - 03:28

హైదరాబాద్, జూన్ 27: రాష్ట్రంలో గన్‌లైసెన్స్‌కూ ఆధార్‌ను లింక్ చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇటీవల లైసెన్సు కలిగిన కొందరు తమ గన్‌ను అనవసరంగా గాల్లోకి కాల్పులు జరిపి దుర్వినియోగం చేసిన సంఘటనలు జరుగుతున్న దరిమిలా ఆధార్ ఆనుసంధానం అనేది అవసరమని భావిస్తున్నారు. ఎవరైతే గన్ లైసెన్స్ కలిగి ఉంటారో వారి ఆధార్ సమాచారాన్ని సమర్పించాలని కోరుతున్నారు.

06/28/2017 - 03:28

కాటారం, జూన్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం బ్యారేజీ పైపు లైన్ సర్వే పనులను మంగళవారం కాటారం మండలంలోని దామెరకుంట వాసులు అడ్డుకున్నారు. దామెరకుంట గ్రామ శివారు నుంచి సర్వే పనులు జరగుతుండగా ఆచార సాంప్రదాయాలకు విఘా తం కలుగుతుందని భావించిన ప్రజలు నిరసన తెలిపారు.

06/28/2017 - 03:27

గంగాధర, జూన్ 27: టిఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పిసిసి ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

06/28/2017 - 03:27

నారాయణఖేడ్ జూన్ 27: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఆర్టీసీ డిఎం కట్ట మహేందర్ (56) మంగళవారం తెల్లవారుజామున ఖేడ్ పట్టణంలో బైపాస్‌రోడ్డులోని పంచగామకు వెళ్లే దారిలో శవమై కనిపించారు. అయన పక్కనే పురుగుల మందు డబ్బు పడి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ నరేందర్ ఉదయం 7 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

06/28/2017 - 03:26

దేవరకొండ, జూన్ 27: లేని జెఏసికి చైర్మన్‌గా వ్యవహరిస్తూ పనిగట్టుకొని టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం అసలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో తేల్చి చెప్పాలని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.

06/28/2017 - 03:16

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణలో కొనసాగుతున్న నియంతృత్వ పాలనను మార్చి తీరుతామని టిజాక్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని టిజాక్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన టిజాక్ స్టీరింగ్ కమిటీ సమావేశమయింది. ఇటీవల సిద్దిపేట, మెదక్‌లో నిర్వహించిన అమరుల స్ఫూర్తి యాత్రతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం కోదండరామ్ అమరుల స్ఫూర్తి యాత్ర విజయవంతమైందన్నారు.

Pages