S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 00:30

సంబేపల్లె, జూలై 28:ఇక్రిశాట్ (అం తర్జాతీయ ఉష్ణమండల పంటల పరిశోధనా సంస్థ) ఆధ్వర్యంలో మండల పరిధిలోని దేవపట్ల గ్రామం కట్టుగుత్తపల్లె రైతులకు గురువారం ఇక్రిశాట్ సంస్థ అంతర్జాతీయ సీనియర్ శాస్తవ్రేత్తలైన కేశవరావు, గిరీష్‌చందర్‌లు రైతు కోసం కార్యక్రమంలో ఇక్రిశాట్ సంస్థ రైతులకు చేస్తున్న వివిధ పరిశోధనలపై వారికి అవగాహన కల్పించారు.

07/29/2016 - 00:29

కడప, జూలై 28:విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆచార్య, సహాచార్య, సహాయకచార్యులు, అధ్యాపకుల భర్తీపై రాష్ట్రప్రభుత్వం తాజాగా గురువారం యోగివేమన విశ్వవిద్యాలయానికి 90 పోస్టులు ఖాళీలు ఉం డగా, 51పోస్టులు మాత్రమే మం జూరుచేసింది. దేశస్థాయిలో 20 ప్రయోగశాలలు విశ్వవిద్యాలయంలో కలిగి ఉండగా సరిపడ అధ్యాపక బృందం లేక మొక్కుబడిగా ప్రయోగాలను నిర్వహిస్తున్నారు.

07/29/2016 - 00:29

కడప(కల్చరల్), జూలై 28:స్వస్తిశ్రీ దుర్మిఖినామ సంవత్సర ఆశాఢ బహుళ నవమి పురస్కరించుకుని గురువారం నగరంలోని పలు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాల్లో శ్రీవల్లీదేవసేన సమేత స్వామివారికి ఆడికృత్తిక మహోత్సవం వైభవంగా జరిగింది. ఈసందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు వారి సమీపంలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

07/29/2016 - 00:28

చెన్నూరు, జూలై 28:పెన్నానది, కుందూనది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారం ఉదయం నుంచి చెన్నూరు వద్ద పెన్నానదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. కర్నూలు జిల్లా ఆర్లగడ్డ, చాగలమర్రి, కోవెలకుంట్ల, కడప జిల్లాలో పెద్దముడియం, జమ్మలమడుగు, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో కుందూనదికి వస్తున్న వర్షం నీరంతా పెన్నాలో చేరుతోంది.

07/29/2016 - 00:28

ఖాజీపేట, జూలై 28:శ్రీశైల జలాశయంలో నీటిని స్థిరీకరించాలని కోరుతూ బస్టాండు కూడలిలో గురువారం రైతు నాయకులు ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీమకు నీరు వచ్చేందుకు 854 అడుగుల సామర్థ్యం డ్యామ్‌లో ఉంటేనే విడుదల చేస్తామని చెబుతున్న నేతలు ఆ సామర్థ్యాన్ని స్థిరీకరించాలని కోరారు. 854 అడుగులు స్థిరీకరించకుండా నాగార్జునసాగర్‌కు ఎలా వదులుతున్నారని ప్రశ్నించారు.

07/29/2016 - 00:27

సుండుపల్లె, జూలై 28: బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్ళి తిరిగి స్వగ్రామానికి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. వివరాలల్లోకి వె ళితే..తిమ్మసముద్రం కస్పాకు చెందిన వెంకటమ్మ గత కొద్ది సంవత్సరాలుగా బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్ళిం ది.

07/29/2016 - 00:27

సుండుపల్లె, జూలై 28:మండల కేంద్రమైన సుండుపల్లె సమీపంలోని అగ్రహారంలో నివాసం ఉంటున్న నూరుల్లా(60) బతుకుదెరువు కోసం కువైట్‌కు రహదారిపై బస్టాండు సమీపంలో కాలుజారి కింద పడి గత మూడు రోజుల నుండి ఆసుపత్రి కోమాలో ఉండి బుధవారం మృతిచెందినట్లు తమకు సమాచారం వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలియగానే కుటుంబంలో విషాదం నెలకొంది. నూరుల్లా భార్యా బిడ్డలు భోరుమని విలపిస్తున్నారు.

07/29/2016 - 00:26

రాయచోటి, జూలై 28:రాయచోటి పట్టణ పరిధిలోని మాధవరానికి చెందిన లక్ష్మీ నరసప్ప అనే వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ లేక బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మాధవరానికి చెందిన లక్ష్మీ నరసప్పకు ఒకే కుమారుడు ఉన్నాడు. ఇతను నాలుగు సంవత్సరాల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి మూలపల్లెకు వెళ్లే దారిలోని ఆంజనేయస్వామి దేవస్థాన పూజారిగా పనిచేస్తుండేవాడు.

07/29/2016 - 00:26

గాలివీడు, జూలై 28:మండలంలోని గాలివీడు గ్రామం దానంరెడ్డిగారిపల్లెకు చెందిన చిన్నసింగం పద్మావతమ్మ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ రెడ్డయ్య తెలిపారు. భర్త వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేశామన్నారు. ఏడాది వయసు కలిగిన కుమారున్ని తన వెంట తీసుకెళ్లిందన్నారు. ఈ సమాచారం తెలిసిన వారు లక్కిరెడ్డిపల్లె సీఐ, స్థానిక పోలీస్‌స్టేషన్లకు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు.

07/29/2016 - 00:25

కమలాపురం, జూలై 28: పిల్లలకు నయం కాని నరాల బలహీనత వ్యాధి సంక్రమించడంతో చిన్నారులతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మండలం సంబటూరు గ్రామసమీపంలో కుంట ఆంజనేయస్వామి ఆలయంవద్ద గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రితో సహా పిల్లలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.

Pages