S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/12/2017 - 01:01

ఆంధ్రభూమి బ్యూరో

10/11/2017 - 00:50

వాషింగ్టన్, అక్టోబర్ 10: జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు మందగమనంగా కొనసాగుతున్నప్పటికీ రానున్న కొనే్నళ్ల కాలంలో అద్భుత రీతిలో పరుగులు పెట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.

10/11/2017 - 00:49

వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. రానున్న రోజుల్లో కార్పొరేట్ ఆదాయ ఫలితాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందన్న కథనాలు మంగళవారం మార్కెట్‌కు మరింత ఊతాన్నిచ్చాయి. ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీ కూడా నేటి లావాదేవీలతో కొత్త శక్తిని సంతరించుకున్నాయి. సెనె్సక్స్ ఏకంగా మూడు వారాల్లో ఎన్నడూ లేనంతగా 77.52 పాయింట్లు పుంజుకుని 31,924.41 పాయింట్లకు చేరుకుంది.

10/11/2017 - 00:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి చికిత్స కోసం తయారుచేసిన ఓ మందుకు న్యూజిలాండ్‌నుంచి పేటెంట్ లభించడంతో సూవెన్ లైఫ్ సైనె్సస్ షేర్లు 5.5 శాతం పెరిగాయి. ఈ పేటెంట్‌పై హక్కులు 2034 వరకు ఉంటాయని సంస్థ సిఇఓ వెంకట్ జస్తి తెలిపారు. తమ సంస్థ చేసిన కృషికి దీన్ని గుర్తింపుగా భావిస్తున్నామని, గ్రాహణ శక్తికి సంబంధించిన లోపాలను సైతం నివారించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.

10/11/2017 - 00:48

చిత్రం.. ఢిల్లీలోని ఎయరోసిటీలో మంగళవారం వోక్స్‌వాగన్ కొత్త కారు న్యూ పస్సాట్‌ను విడుదల చేస్తున్న సంస్థ డైరెక్టర్ స్టీఫెన్ నాప్

10/11/2017 - 00:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: గత మూడు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా అమలుచేస్తున్న ఆర్థిక సంస్కరణల కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ చాలా బలంగా నిలబడిందని ఒపెక్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ బార్కిండో అన్నారు. ముఖ్యంగా ఈ ఆర్థిక సంస్కరణల వల్ల వ్యవస్థాగతమైన గుణాత్మక మార్పులు సాకారమయ్యాయని, భారత్ బలమైన వృద్ధిని సాధించేందుకు ఇవి విశేషంగా దోహదం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

10/11/2017 - 00:46

తిరుపతి, అక్టోబర్ 10: దేశం నలుమూలల నుంచి విమానాలు, రైళ్లు ద్వారా తిరుపతికి వచ్చే భక్తులు, పర్యాటకులు తిరుపతిలో కార్లు సొంతంగా నడుపుకుని తిరగడానికి వీలుగా జూమ్ కార్ సంస్థ మంగళవారం నాడు తన సేవలను ప్రారంభించినట్లు ఆ సంస్థ సిఇఓ గేల్‌మోర్గాన్ తెలిపారు. తిరుమల బాలాజీ నగరంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఈసేవలను ప్రవేశ పెట్టామన్నారు.

10/11/2017 - 00:43

కొత్తగూడెం, అక్టోబర్ 10: బొగ్గుగని కార్మికుల పదవ వేతన ఒప్పందం మంగళవారం ఖరారైంది. ఢిల్లీలో జరిగిన జెబిసిసి సమావేశంలో కోల్ ఇండియా యాజమాన్యానికి, జాతీయ కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలో వేతన ఒప్పందం కుదిరింది. దీంతో బొగ్గుగనుల్లో పనిచేస్తున్న కార్మికులకు 2016 నుంచి రావాల్సిన వేతనాల నుంచి రూ.40వేలను దీపావళి పండుగకు వేజ్‌బోర్డు అలవెన్సులను అడ్వాన్సుగా చెల్లించేందుకు నిర్ణయించారు.

10/11/2017 - 00:43

విశాఖపట్నం, అక్టోబర్ 10: నూతన సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో భారతీయ పరిశ్రమలు విదేశీ వాణిజ్య లావాదేవీలు, ముఖ్యంగా ఎగుమతులపై దృష్టిసారించడం ద్వారానే భవిష్యత్‌లో మనుగడ సాంధించగలుగుతాయని భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ విదేశీ వాణిజ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అలోక్ త్రివేది పేర్కొన్నారు.

Pages