-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, జూలై 12: వరుస లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయికి చేరుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 57.73 పాయింట్లు పుంజుకుని 31,804.82 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 30.05 పాయింట్లు పెరిగి 9,816.10 వద్ద నిలిచింది. దీంతో నూతన ఆల్టైమ్ హైకి సూచీలు చేరినట్లైంది.
హైదరాబాద్, జూలై 11: జిఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ (జిహెచ్ఐఎఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ).. బుధవారం నుంచి హైదరాబాద్-కొలంబో మధ్య నాన్-స్టాప్ విమానాలు ప్రారంభమవుతాయని మంగళవారం ప్రకటించింది. ఈ విమానాలను శ్రీలంకన్ ఎయిర్లైన్స్ నడుపుతుందని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 11: దేశీయ ప్రైవేట్రంగ బ్యాంకింగ్ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 6.7 శాతం పెరిగి 101.47 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్లో ఇది 95.06 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,709.97 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,620.67 కోట్ల రూపాయలుగా ఉంది.
న్యూఢిల్లీ, జూలై 11: దేశీయ ప్రైవేట్రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 26.5 శాతం పెరిగి 836.55 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్లో ఇది 661.38 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 5,302.77 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 4,363.57 కోట్ల రూపాయలుగా ఉంది.
హైదరాబాద్, జూలై 11: విద్యుత్ సంస్థల పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. 650 వోల్టెజీలకుపైన ఉండే పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు విద్యుత్ క్లియరెన్స్ సర్ట్ఫికెట్లను 14 రోజుల్లోనే జారీ చేస్తామని రాష్ట్ర విద్యుత్, ఎస్సి అభివృద్ధి శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఇందు కు సంబంధించిన వెబ్పోర్టల్ను ఆవిష్కరించారు.
చిన్నతరహా వాణిజ్య వాహనాల (ఎస్సివి) శ్రేణిని దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ విస్తరించింది.
తమ ఏస్ జిప్, ఏస్ మెగా, ఏస్ రేంజ్ వాహనాల్లో సరికొత్త ‘ఎక్స్ఎల్ సిరీస్’ను మంగళవారం మార్కెట్కు పరిచయం చేసింది. 15 శాతం అదనపు లోడింగ్ సామర్థ్యంతో ముందుకొచ్చిన వీటిలో ముంబయ ఎక్స్షోరూం ప్రకారం ఏస్ జిప్ ఎక్స్ఎల్ ధర 3.08 లక్షల రూపాయలు,
ముంబయి, జూలై 11: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మరో సరికొత్త స్థాయిని చేరాయి. స్వల్ప లాభాలనే అందుకున్నప్పటికీ, సోమవారం రికార్డు స్థాయి లాభాల్లో ముగిసిన నేపథ్యంలో నూతన ఆల్టైమ్ హైకి సూచీలు చేరినట్లైంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 31.45 పాయింట్లు పెరిగి 31,747.09 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 15 పాయింట్లు అందిపుచ్చుకుని 9,786.05 వద్ద నిలిచింది.
న్యూఢిల్లీ, జూలై 11: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో.. మంగళవారం నూతన టారీఫ్ ప్లాన్లను ప్రకటించింది. 399 రూపాయలకే 84జిబి డేటా (84 రోజులు రోజుకు 1జిబి)ను ఇస్తామంది. ఇదిలావుంటే గతంలో 309 రూపాయలకే ఈ ఆఫర్ లభించగా, అదికాస్తా.. ఇప్పుడు 56జిబి డేటాకు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జియోకు 112 మిలియన్లకుపైగా వినియోగదారులున్నారు.
విశాఖపట్నం, జూలై 11: మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) సంప్రదాయ ఇంధన వనరులను పెంపొందించుకునే దిశగా అడుగులేస్తోంది. ఖాళీ స్థలాల్లో సోలార్ పలకలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పాదనకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే మంచినీటి రిజర్వాయర్లపైనా సోలార్ పలకలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుదుత్పత్తి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
న్యూఢిల్లీ, జూలై 11: మత సంస్థలు నిర్వహించే అన్న క్షేత్రాల్లో సప్లై చేసే ఉచిత ఆహారాన్ని జిఎస్టి పరిధినుంచి మినహాయించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. అలాగే దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, దర్గాలు లాంటి ప్రార్థనా స్థలాల్లో పంపిణీ చేసే ప్రసాదాలపై కూడా వస్తు సేవల పన్ను (జిఎస్టి) ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.