-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణలో స్టీల్ పరిశ్రమ విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక సంక్షోభంలో పడింది. రెండేళ్ల క్రితం వరకు విద్యుత్ కొరతతో సతమతమైన ఉక్కు పరిశ్రమకు ఈ రోజు సరిపడా విద్యుత్ సరఫరా అవుతోంది. అయతే 2009-10లో ఒక యూనిట్ విద్యుత్ ధర రూ. 3.15 పైసలు ఉంటే, నేడు రూ. 7 కావడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది.
హైదరాబాద్, అక్టోబర్ 4: జర్మనీ కానె్సల్ హైదరాబాద్ విభాగానికి గౌరవ కానె్సల్గా నాస్కాం మాజీ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. జర్మన్ దేశ రాయబారి మార్టిన్ నే, ఆయన సతీమణి గాబ్రి ల్ నీ, ఐటి దిగ్గజం బివిఆర్ మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును మంగళవారం కలిశారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 4: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యక్తిగత ఆస్తుల ముందస్తు ప్రకటన పథకం (ఐడిఎస్) విజయవతమైందని భారత చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ (ఐసిఎఐ) అధ్యక్షుడు ఎం దేవరాజారెడ్డి అన్నారు. చార్టర్ట్ అకౌంటెంట్ల అంతర్జాతీయ సమ్మేళనం ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. మంగళవారం ఢిల్లీలో దేవరాజారెడ్డి తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు.
పాల్వంచ, అక్టోబర్ 4: ఖమ్మం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మిస్తున్న కెటిపిఎస్ 7వ దశ కర్మాగార నిర్మాణ పనులను టిఎస్ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కర్మాగారంలో టిజిడెక్, కూలింగ్ టవర్ ఇఎస్పి చినీ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం కెటిపిఎస్ ఓఅండ్ఎమ్ కర్మాగారంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముంబయి, అక్టోబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మంగళవారం ద్రవ్యసమీక్ష నిర్వహించనున్న క్రమంలో కీలక వడ్డీరేట్లు తగ్గవచ్చన్న అంచనాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. సెప్టెంబర్ నెలలో దేశీయ ఆటో రంగ అమ్మకాలు బాగుండటం, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పుంజుకోవడం వంటివి కలిసొచ్చాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: మలేషియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా దేశ, విదేశీ ప్రయాణికుల కోసం సోమవారం పలు రాయితీలను ప్రకటించింది. ఎయిర్ ఏషియా ఇండియాతోపాటు వివిధ దేశాల్లో నడుస్తున్న తమ విమానాల్లో ప్రయాణించేవారికి ఈ రాయితీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దేశీయ టెలికామ్ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీమధ్య కస్టమర్లను ఆకర్షించడానికి టెలికామ్ సంస్థలు రోజుకో ఆఫర్ను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం వొడాఫోన్ సంస్థ కస్టమర్లందరికీ వీడియోలు, సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్తో నిండిన ‘వొడాఫోన్ ప్లే’ యాప్ 3 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ను ప్రకటించింది.
హైదరాబాద్, అక్టోబర్ 3: కొత్త రాష్ట్రానికి సహజంగా అనేక సవాళ్లు ఎదురవుతాయని, అయతే వాటిని విజయవంతంగా ఎదుర్కొని నిలిచామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఐఎస్బి, భారత విదేశాంగ శాఖ సంయుక్తంగా సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో కెటిఆర్ మాట్లాడారు.
సోమవారం బెంగళూరులో చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవా భారతీయ మార్కెట్కు సరికొత్త ల్యాప్ట్యాప్లను పరిచయం చేసింది. వీటి ధరల శ్రేణి రూ. 17,490-1,28,090
హైదరాబాద్, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున గోదాంల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్విఎస్ఆర్కె ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి లేక్వ్యూ అతిథి గృహంలో పాత్రికేయులతో మాట్లాడుతూ గోదాంలతోపాటు ఆక్వా కోల్డ్ స్టోరేజీలు, మిర్చి, పసుపు కోల్డ్ స్టోరేజీలు కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామ ని పేర్కొన్నారు.