-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలోని ప్రముఖ రుణ వితరణ సంస్థల్లో ఒకటైన డిహెచ్ఎఫ్ఎల్ (దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) గృహ రుణాలపై వడ్డీ రేటును 0.2 శాతం తగ్గించింది. ప్రస్తుత పండుగల సీజన్లో కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు డిహెచ్ఎఫ్ఎల్ ఈ చర్య చేపట్టింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: జీవిత బీమా సంస్థ(ఎల్ఐసి)కు ప్రాధాన్యత ప్రాతిపదికపై 7.17 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూ బ్యాంక్ తెలిపింది. దీనిద్వారా బ్యాంక్కు రూ 270కోట్లు లభిస్తాయి. సెబి నిర్ణయించిన ధరకు ఎల్ఐసికి ప్రాధాన్యత ప్రాతిపదికపై 7.17 ఓట్ల షేర్లను విక్రయించడానికి ఇటీవల జరిగిన బోర్డు సమావేశం నిర్ణయించింది. దీంతో బ్యాంకులో ఎల్ఐసి వాటా 5.5 శాతానికి పెరుతుంది.
హైదరాబాద్, అక్టోబర్ 6: భారతదేశానికి బయోఫార్మా, బయో జెనెటిక్స్ రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, 2030 సంవత్సరం నాటికి బయో ఉత్పత్తుల టర్నోవర్ రూ. 40 బిలియన్ డాలర్లకు చేరుతుందని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరక్టెర్ జనరల్ ప్రొఫెసర్ డి.స్వామినాథన్ అన్నారు. బయోఫార్మాపై గురువారం ఇక్కడ అసోచామ్, కేంద్ర ఫార్మాసూటికల్స్ శాఖ సదస్సు నిర్వహించాయ.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పారదర్శక ప్రఅకియలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం లాంటి కారణాల వల్ల దేశం రాబోయే ఒకటి, రెండు దశాబ్దాల్లో 8 శాతానికి పైగా వృద్ధి సాధించడానికి తోడ్పడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ దిశగా రాష్ట్రాలు కేంద్రంతో కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని ఆమె అన్నారు. ‘8 శాతం వృద్ధి సాధ్యమే.
న్యూఢిల్లీ అక్టోబరు 6: తెలంగాణలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామరావు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సిఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్లో కెటిఆర్ పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 6: వచ్చే నెల 7 నుంచి 12వ తేదీ వరకు ఢిల్లీలో జరిగి అంతర్జాతీయ పొగాకు నియంత్రణ సదస్సుకు అఖిల భారత బీడీ పరిశ్రమ సమాఖ్య ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని సమాఖ్య అధ్యక్షుడు రజనీకాంత్ పి.పటేల్ కేంద్రాన్ని కోరారు. దేశంలో లక్షలాది మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సదస్సులో పొగాకుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 6: దేశంలో అగ్రశ్రేణి టెలికామ్ సర్వీసు ప్రొవైడర్ వోడాఫోన్ ఇండియా నవరాత్రి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వోడాఫోన్స్ తెలంగాణ, తెలంగాణాస్ వోడాఫోన్ స్ఫూర్తితో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్ధ బిజినెస్ హెడ్ రోహిత్ టాండన్ తెలిపారు. 8వ తేదీ సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య హైదరాబాద్లో వోడాఫోన్ స్టోర్లను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన గేమ్స్లో పాల్గొనాలని కోరారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ఆర్థికాభివృద్ధిలో పురోగమిస్తున్న భారత్కు మున్ముందు మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఖాయమని, రానున్న 25 ఏళ్లు భారత్వేనని ప్రముఖ పారిశ్రామికవేత్త, హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ త్వరలో వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలు బులియన్ మార్కెట్ను ఒక్కసారిగా వణికించాయి. దీంతో బుధవారం ఒక్కరోజే 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 730 రూపాయలు క్షీణిస్తే, కిలో వెండి వెల 1,750 రూపాయలు దిగజారింది. పుత్తడి ధర ఈ ఏడాదిలో కేవలం ఒక్కరోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం.
వాషింగ్టన్, అక్టోబర్ 5: భారత్లో 69 శాతం ఉద్యోగాలను ఆటోమేషన్ ప్రభావితం చేస్తోందని ప్రపంచ బ్యాంక్ పరిశోధన ఒకటి తెలిపింది. చైనాలో ఇది 77 శాతంగా ఉందని, ఇథియోపియాలోనైతే 85 శాతమని వెల్లడించింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అన్నిం టా యాంత్రిక శక్తి విస్తరిస్తోందని, దీనివల్ల మానవ శక్తి నిర్వీర్యమవుతోందని చెప్పింది.