S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
ఒకనాడు విద్యావ్యవస్థ పారిశ్రామిక శక్తులతో రూపొందించబడింది. కానీ, ఈనాడు ఎన్నో శక్తులు ప్రభావితం చేయడంతో అదొక సంక్లిష్ట వ్యవస్తగా మారింది. అది ప్రతిక్షణం మారుతూ ఉంటుంది. ఎంతోమంది అవసరాలను పూర్తిచేయవలసి ఉంటుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, యజమానులు, వృత్తిపరమైన సంస్థలు, రాజకీయ నాయకులు ఎంతోమంది అవసరాలను, ఆశయాలను విద్యావ్యవస్థ ద్వారా పూర్తిచేయవలసి ఉంటుంది. ఈ వ్యవస్థలో వైవిధ్యాలు కనపడుతూ ఉంటాయి.
టీవీ చానళ్లలో మనకు తరచూ కనబడుతున్న దృశ్యాలు.. నీటి వనరులు మృగ్యమై ఎండిపోయిన పంటపొలాలు.. ఆశతో పెట్టుబడి పెట్టినా- నమ్ముకున్న భూమి బీడుగా మారాక బీదతనంలో దిక్కుతోచని అన్నదాతలు.. నీటి కోసం పొలంలో నాలుగుచోట్ల బోర్లు వేయించి వేయి అడుగుల లోతు వరకూ వెళ్లాం.. అయినా నీటి చుక్కను చూడలేదు.. కానీ- కన్నీటి చుక్కలే మిగిలాయి అంటున్నారు రాయలసీమ వాసులు.
కెన్యా దేశానికి వాయువ్యాన వున్న ‘టర్కానా’లో వాతావరణం పొడిగా ఉంటూ కాలం నిడివి పెరుగుతోంది. వర్షాలు లేక ఇక్కడి ప్రజలకు నీటి ఎద్దడి పెనుసమస్యగా మారింది. వాతావరణం మార్పుల వల్ల పంటలు పండక టర్కానా ప్రజల్లో పేదరికం పెరగడం మరో విపరిణామం. ఆహారం, నీరు లభించక వీరు నానా అవస్థలు పడుతున్నారని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ నివేదిక పేర్కొంది.
మన దేశంలో ‘ఆర్థిక సర్వే 2016-17’ సార్వత్రిక మూల ఆదాయాన్ని ప్రతిపాదించినది. ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో పేదరికం, నిరుద్యోగం ముఖ్యమైనవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ దాదాపు 20 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనున్నారు. శ్రామిక శక్తిలో 10 శాతం నిరుద్యోగం, అల్ప ఉద్యోగితకు గురవుతున్నారు.
నిజం ఎప్పటికీ దాగదు. కాస్త అటుఇటుగా కొన్నాళ్ల తర్వాతైనా బయటపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ‘తెరవెనుక’ రహస్యాలను వెలికితీస్తున్న ‘వికీలీక్స్’పై ఎంతగా అణచివేత చర్యలు చేపట్టినా, నిజాలు బహిర్గతం కాకుండా ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇప్పుడు సోషల్ మీడియా ఒక బలమైన శక్తి.
చత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో కొద్దిరోజుల క్రితం మావోయిస్టులు భయానక విధ్వంసం సృష్టించి 26 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను బలిగొన్నారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు ఆచూకీ లేకుండాపోయారు. చత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఆంధ్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో తరచూ మావోయిస్టుల హింసాత్మక చర్యల్లో జవాన్లు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.
విధి నిర్వహణలో ఉన్న కార్మికులు, ఉద్యోగుల భద్రతకు రానురాను ప్రాధాన్యం పెరుగుతోంది. సురక్షిత విధానాలు, ప్రమాదాలు జరగకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులు పాటించడం, ప్రమాదాలు ఏర్పడినప్పుడు గాయపడిన, మరణించినవారి కుటుంబాలను ఆదుకోవడంపై సానుకూల చర్యలు తీసుకోవలసిన అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగాల్లో మరిన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేయవలసి ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయంపై శ్రద్ధచూపుతోంది.
తూర్పుతీర ప్రాంతవాసులకు ఉపయోగకరంగా ఉండేందుకు కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి హౌరా స్టేషన్కు ఈ వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపాలి. విశాఖ, విజయవాడ, భువనేశ్వర్, ఖరగ్పూర్ మీదుగా ఈ రైళ్లు నడిపితే తీరప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రస్తుతం నడుపుతున్న రైళ్లు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో పనులకోసం ఈ ప్రాంతం నుంచి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
ఉస్మానియా యూనివర్శిటీ భవన నిర్మాణం గమనించారా? లోపల మెట్లు ఎక్కేచోట ఒక శిల్పి ‘ఓం’కారాన్ని చెక్కి ఉన్నారు చూడండి.. ఇది నూరేండ్ల నాటిమాట! 1940 దశకంలో నిజాం కళాశాలలో తెలుగు ఉండేది. ఎం.ఏ. తెలుగు 1944 ప్రాంతంలో యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రారంభమైంది.
క్యూబా విద్యారంగంలో ఎన్నో ప్రయోగాలు చేసింది. అది కేవలం లాటిన్ అమెరికా వారికే కాకుండా ప్రపంచంలోని చాలా మూలాల్లో ఉన్న ప్రజానీకంపై కూడా తీవ్ర ప్రభావం పడింది.