-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, నవంబర్ 5: బూటకపు ఎన్కౌంటర్ హత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచరణ జరిపించాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్కౌంటర్ పేరుతో 31మందిని తీవ్ర చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటకపుఎన్కౌంటర్ హత్యలపై రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో శనివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
మచిలీపట్నం, నవంబర్ 5: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పండంటి ఆడ శిశువు మృతి చెందిన వైనం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు, నవంబర్ 5: వచ్చే ఏడాది ప్రారంభంలోగా రాష్ట్రంలో అన్ని మున్సిపల్ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. శనివారం నెల్లూరులో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ జలమండలి అధికారుల నిర్వాకం కారణంగా మోటారు సైకిలిస్ట్ గోతిలోకి దిగబడ్డాడు. సఫిల్గూడ చౌరస్తా నుంచి ఆనంద్బాగ్ వరకు పైప్లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయ. గుంతలు సరిగ్గా పూడ్చకపోవడంతో శనివారం ఆ రోడ్డు కుంగి మల్కాజిగిరి ప్రాంతవాసి అంజనేయులు మరో మహిళ బైక్సహా గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారు. అధికారుల తీరు పట్ల తెదేపా, భాజపా ధర్నా నిర్వహించాయ.
హైదరాబాద్, నవంబర్ 5: ప్రేమకు మించినది సమాజంలో మరొకటి లేదు. మీరు ప్రేమను పెంచితే శత్రువు కూడా మిత్రుడవుతారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత శ్రీశ్రీ రవిశంకర్జీ అన్నారు. అన్ని మతాలు శాంతినే ప్రబోధించాయన్నారు. శనివారం ఇక్కడ ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ శాంతి సదస్సులో ప్రసంగించారు. ప్రేమ అందరినీ కలుపుతుందని, మతాలు వేరైనా దేవుడొక్కడే అన్నారు.
హైదరాబాద్, నవంబర్ 5: భవిష్యత్లో అన్ని భారతీయ భాషల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి రానుందని కేంద్ర కమ్యూకేషన్లు, న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ నోవాటెల్లో జరుగుతున్న ఐకాన్ 57వ విశ్వ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇంటర్ నెట్ భాష ఇంగ్లీషుకు మాత్రమే పరిమితం కాబోదన్నారు.
కర్నూలు, నవంబర్ 5: ‘మహిళల శక్తి అనన్యసామాన్యమైనది, వారు తలుచుకుంటే ఏదైనా సాధించే శక్తి ఉంది. వారికి అవకాశం కల్పిస్తే సమాజాభివృద్ధికి పాటుపడతారు. అందుకే వారికి ఎన్ని అవకాశాలు ఉంటే వాటన్నింటినీ కల్పించి రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్నాన’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
హైదరాబాద్, నవంబర్ 5: శాస్త్ర సాంకేతిక సమాచార విప్లవానికి కేంద్ర బిందువుగా ఉన్న ఇంటర్నెట్ అంశాలపై హైదరాబాద్లో జరుగుతున్న తొలి విశ్వ సదస్సుపైనే అందరి దృష్టి పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం, నామఫలకాలు, ప్రాంతీయ భాషల్లో వినియోగం, అంతర్జాల చట్టాలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి సంబంధించి పెనుమార్పులు చోటుచేసుకోనున్న తరుణంలో సదస్సుకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది.
హైదరాబాద్, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఎంపిక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుండి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వచ్చే ఏడాది సెప్టెంబర్ 3వ తేదీ వరకూ జారీ చేసిన నోటిఫికేషన్లకు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.