-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విజయవాడ: 116 రోజులపాటు నీరు-ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ప్రాధాన్యత ప్రాజెక్టుల పనులపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేసి చూపిస్తామని సీఎం స్పష్టం చేశారు. రెండేళ్లు వర్షాలు పడకపోయినా నీటికి కొదవ లేకుండా చేస్తామన్నారు.
సిద్దిపేట: రాష్ట్రంలోని ఆరు వేల దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నమని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. మద్దూరు మండలం బెక్కల్ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఇవాళ హరీశ్రావు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.80 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్: ఏపీ హక్కుల సాధన కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. జేఏసీ, జేఏఫ్సీ ఏర్పాటుపై సోమవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సమావేశంలో అందరి అభిప్రాయాలు సేకరిస్తామని అన్నారు.
హైదరాబాద్: జేఏసీ ఏర్పాటుపై మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ కుమార్, లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్తో సోమవారం భేటీ అయ్యారు. విభజన హామీల అమలు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ జేఏసీ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. పవన్ సూచనతో జేపీ, ఉండవల్లి హైదరాబాద్లో సమావేశం అయ్యారు.
చింతపల్లి : పెదపాకలు గ్రామంలో స్థానికులు ఆంత్రాక్స్ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. తాజంగి పీహెచ్సీ సిబ్బంది గ్రామానికి వెళ్లి ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్న రోగి బాలేసును హుటాహుటిన విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. మండల ప్రత్యేక అధికారి రవీంద్ర వైద్య సిబ్బందితో ఆదివారం గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ..
సైబరాబాద్ :గత నెల 29న కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. మహిళ కుటుంబ సభ్యులే ఆమెను చంపి ఎనిమిది ముక్కలుగా చేసి గోనె సంచుల్లో బొటానికల్ గార్డెన్ వద్ద పడేసినట్లు గుర్తించారు. కొండాపూర్లోని ఓ బార్లో పనిచేసే అమర్కాంత్ జా తన తల్లి, అన్నతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేల్చారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 11: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణతో ఎపికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ ఆదివారం కీలక భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, కేంద్రం తీరు, ప్రభుత్వ తప్పిదాల పట్ల కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎపి ప్రభుత్వానికి ఈ నెల 15 వరకు డెడ్లైన్ విధించారు.
విజయవాడ (పటమట) ఫిబ్రవరి 10: విజయవాడ గుణదలమాత మహోత్సవాల రెండో రోజు శనివారం గుణదల కొండకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, ప్రక్క రాష్ట్రాల నుండి భక్తులు మరియమాత ఉత్సవాలకు లక్షలాదిగా తరలిరావటంతో పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. కొండపై గుణదలమాత (మరియమాత)ను, కొండ శిఖరాన ఏసుక్రీస్తును శిలువను భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. అమ్మ వందనం..
హైదరాబాద్, ఫిబ్రవరి 10: భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు శనివారం నాడు హైదరాబాద్ వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, నగర జాయింట్ కమిషనర్ శివప్రసాద్, ప్రోటోకాల్ అధికారులు, పోలీసు అధికారులు, హైదరాబాద్ కలెక్టర్ యోగిత రానా ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యావేత్తలతోపాటు సామాజికవేత్తలు, రాజకీయ నాయకులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.