-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, ఫిబ్రవరి 10: కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు రాష్ట్రంలో బంద్ చేసినా కేంద్రం వైఖరిలో మార్పు లేదని, వట్టిమాటలు కట్టిపెట్టి హామీలను అమలుచేసేందుకు కృషి చేయాలని టీడీపీ, బీజేపీ పార్టీలను వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10: క్షణం తీరిక లేకుండా గజి బిజి జీవితాలను గడుపుతున్న నగరవాసులకు ఆథ్మాత్మిక విషయాలను బోదించేందుకు ప్రజాపతి బ్రహ్మకుమారీస్ సంస్థ నగరంలో ఆథ్యాత్మిక ఉత్సవాన్ని నిర్వహించ నుంది. సంస్థ స్థాపించి 82 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆదివారం నుంచి ఈనెల 18 వరకు బేగంపేటలోని కంట్రీక్లబ్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతనిధి రాధిక ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీశైలం, ఫిబ్రవరి 10: శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి, అమ్మవార్లకు రావణ వాహనసేవ నిర్వహించారు. ఉదయం అక్కమహాదేవి మండపంలో అందంగా అలంకరించిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణవాహనంపై ఆది దంపతులను ఆశీనులను చేయించి పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు, హారతి అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 10: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను రోడ్డుమార్గంలో హైద్రాబాద్కు తరలించి, మరోవ్యక్తికి ప్రాణం పోసిన నగర పోలీసులు భేష్ అనిపించుకున్నారు. జగిత్యాల జిల్లా కోర్టు మండలం చిన్న మెట్పల్లికి చెందిన మేకల నవీన్ కుమార్ (17) ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డాడు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా జరుగుతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ 6 కొత్త చాప్టర్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు రూపొందించే పార్టీ ప్రణాళికలో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ సలహాలు తీసుకుంటామన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10: ‘తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం’గా నిలుస్తుందని 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించింది. వివిధ అభివృద్ధి పథకాలతో పాటు, నీటి పారుదల ప్రాజెక్టుల పనుల వేగవంతం, నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ సంతృప్తిగా ఉందని అభినందించింది.
భీమవరం, ఫిబ్రవరి 10: రానున్న రోజుల్లో సీపీఎంకు పూర్వవైభవం రావడం ఖాయమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ధీమా వ్యక్తం చేశారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వామపక్ష ప్రజాతంత్ర సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని ఆయన ప్రకటించారు. సీపీఎం పార్టీ ఏర్పడిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తొలిసారిగా 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి.
నెల్లూరు, ఫిబ్రవరి 10: ఊపిరి ఉన్నంత వరకూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం ఆయన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని బోడిగుడిపాడు గ్రామంలోని బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా వలన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో 2019 నాటికి రూ. 50 వేల కోట్లతో 19 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం రాజమహేంద్రవరం వచ్చిన మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం గృహ నిర్మాణంపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10: దేశవ్యాప్తంగా మెడిసిన్, డెంటల్ యుజి కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యుజి-2018) నోటిఫికేషన్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జారీ చేసింది. ప్రకటించిన నిబంధనల ప్రకారం నీట్గా డ్రెస్ వేసుకున్న వాళ్లనే పరీక్షకు అనుమతిస్తామని ముందే సూచించింది.