S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/08/2017 - 01:55

చింతూరు, సెప్టెంబర్ 7: కాళ్లవాపు వ్యాధి లక్షణాలతో తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఎజి కోడేరు గ్రామానికి చెందిన అగరం లక్ష్మయ్య (70) గురువారం మృతిచెందారు. గత కొన్ని రోజుల నుంచి లక్ష్మయ్య కాళ్లవాపు వ్యాధి లక్షణాలతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు చింతూరు ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు.

09/08/2017 - 01:54

అమరావతి, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్మాణ నిర్వహణలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ రికార్డు నెలకొల్పింది. పట్టిసీమ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి (కెసి కాలువ) ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసిన సంస్థ ఇప్పుడు ముచ్చుమర్రి (హంద్రీ-నీవా సుజల స్రవంతి) వద్ద మరో స్కీంను పూర్తిచేసింది.

09/08/2017 - 01:53

అనంతపురం, సెప్టెంబర్ 7: ముఖ్యమంత్రి చంద్రమాబు నాయుడు శుక్రవారం రాయలసీమలో పర్యటించనున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జరిగే జలసిరికి హారతి కార్యక్రమాల్లో బాబు పాల్గొంటారు. రాజధాని నుంచి కర్నూలు జిల్లా ముచ్చుమర్రికి చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ కృష్ణమ్మకు హారతి ఇస్తారు. అనంతరం ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మోటార్లను ప్రారంభించి కె సి కెనాల్‌కు నీటిని విడుదల చేస్తారు.

09/08/2017 - 01:53

శ్రీశైలం, సెప్టెంబర్ 7: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. గురువారం ఎగువ నుంచి 24వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 809.40 అడుగులుగా నమోదైంది పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 33.95 టిఎంసిల నీరు ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి 22వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది.

09/08/2017 - 01:49

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, రాష్ట్రంలో కరవును పారదోలడమే జలసిరికి పూజా సంకల్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నా రు. గోదావరి నది రాష్ట్రానికి జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి, జాతికి అంకితం చేస్తానని, అదే తన సంకల్పమన్నారు. జలసిరి హారతిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

09/08/2017 - 00:12

నెల్లూరు, సెప్టెంబర్ 7: నెల్లూరు జిల్లా విద్యా శాఖ అధికారి మువ్వా రామలింగాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సరండర్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం జిల్లా విద్యా శాఖ కార్యాలయం సర్వ శిక్షా అభియాన్ కార్యాలయాన్ని పాఠశాల విద్యా శాఖ ఇన్‌చార్జి కమిషనర్, సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు రాష్ట్ర అధికారి గుర్రాల శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ చేశారు.

09/08/2017 - 00:11

విజయవాడ, సెప్టెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని అయితే ఇదే సమయంలో కృష్ణానదిని ఎడారిగా మారుస్తున్న ఎగువ రాష్ట్రాల్లోని అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు.

09/08/2017 - 00:10

విజయవాడ, సెప్టెంబర్ 7: కృష్ణా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించేందుకు ప్రారంభించిన పథకాలు ఫలాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం కృష్ణా ఆయకట్టులో దాదాపు 81 శాతం వరినాట్లు పూర్తయ్యాయి. జలసిరికి హారతి కార్యక్రమం మూడురోజులపాటు జరుగుతున్న తరుణంలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగటంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 11.5 అడుగుల మేరకు నీరు వచ్చింది.

09/08/2017 - 00:09

విజయవాడ, సెప్టెంబర్ 7: ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కలల, ఊహాజనిత రాజధాని.. కొందరి స్వప్రయోజనాల కోసం అమాయకులను మోసగించేలా ప్రచారం సాగుతోంది.. ఎప్పటికైనా కుప్పకూలిపోయి సమాధి అవుతుంద’ని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు.

09/07/2017 - 23:02

విజయవాడ, సెప్టెంబర్ 7: రాష్టవ్య్రాప్తంగా వివిధ ట్రెజరీ కార్యాలయాల్లో జరిగిన ఆర్థిక నేరాలపై విచారణ పూర్తయి రెండు మాసాలు గడుస్తున్నప్పటికీ సంబంధిత నివేదిక వెలుగుచూడకపోగా నేటి వరకు ఏ ఒక్క నిందితునిపై చర్య లేకపోవటం ఆశ్చర్యకరం. విశాఖపట్నానికి చెందిన ట్రెజరీ అధికారి ఒకరు దాదాపు నెల రోజుల పాటు గుంటూరు జిల్లాలో మకాం వేసి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందించడం కూడా జరిగింది.

Pages