-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, జూలై 4: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) భాగస్వామ్యంతో భారతీయ మొబైల్ తయారీ సంస్థ అయిన కార్బన్ మొబైల్స్.. దేశంలోనే తొలిసారిగా ‘్భమ్’ డిజిటల్ పేమెంట్ యాప్తో ఓ స్మార్ట్ఫోన్ను మార్కెట్కు పరిచయం చేసింది. కె9 కవాచ్ 4జి పేరుతో విడుదలైన దీని ధర 5,290 రూపాయలు. ఆన్లైన్తోపాటు, ఆఫ్లైన్ మార్కెట్లో ఇదే ధర ఉంటుందని కార్బన్ మొబైల్స్ మంగళవారం తెలిపింది.
హైదరాబాద్, జూలై 4: దక్షిణ మధ్య రైల్వే మరో రెండు అరుదైన జాతీయ అవార్డులు దక్కించుకుంది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని రాయనపాడు వాగన్ వర్కుషాపు, సికిందరాబాద్ రైల్వే డివిజన్లో సూపర్వైజర్ల శిక్షణ కేంద్రానికి ఈ అవార్డులు లభించాయి. రాయలపాడు వర్కుషాపు జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది బెస్ట్ వర్కుషాపు 2016-17 షీల్డ్ను కైవసం చేసుకుంది.
హైదరాబాద్, జూలై 4: హైదరాబాద్ నగరం ఫార్మాస్యుటికల్ హబ్గా రూపాంతరం చెందుతున్నందున రసాయన శాస్త్రంలో పట్టు సాధించిన విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయని గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్లో మూడేళ్ల బిఎస్సీ కోర్సును ఆయన మంగళవారం ప్రారంభించారు.
న్యూఢిల్లీ, జూలై 4: సహారా లైఫ్ ఇన్సూరెన్స్ను కొనేందుకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఆసక్తి కనబరుస్తోంది. సుబ్రతా రాయ్ నేతృత్వంలోని సహారా గ్రూప్నకు చెందిన ఈ సంస్థ పాలసీలు, ఆస్తుల విలువ 900 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డిఎఐ.. గత నెల సహారా లైఫ్ ఇన్సూరెన్స్ను తమ అధీనంలోకి తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా దాని తీరుందంటూ ఆక్షేపించినది తెలిసిందే.
న్యూఢిల్లీ, జూలై 4: వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అమలు నేపథ్యంలో దేశీయ ఆటో రంగ సంస్థలు వాహన ధరలను తగ్గిస్తున్నాయ. మంగళవారం మహీంద్ర అండ్ మహీంద్ర తమ యుటిలిటి వాహనాలపై, ఎస్యువిలపై 6.9 శాతం ధరలను తగ్గించింది.
న్యూఢిల్లీ, జూలై 4: బులియన్ మార్కెట్లో మంగళవారం వెండి ధర భారీగా పతనమైంది. ఈ ఒక్కరోజే కిలో ధర ఏకంగా 1,335 రూపాయలు క్షీణించింది. దీంతో 39 వేల స్థాయిని కోల్పోయి 38,265 వద్ద స్థిరపడింది. అటు బంగారం విలువ కూడా తగ్గింది. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 90 రూపాయలు దిగజారి 29,310 వద్ద నిలిచింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలే మార్కెట్ పతనానికి కారణమని బులియన్ ట్రేడర్లు విశే్లషిస్తున్నారు.
హైదరాబాద్, జూలై 4: ఈ ఏడాది భారత ఐటి రంగంలో వృద్ధిరేటు మందగించే అవకాశాలు ఉన్నాయని, గత ఎనిమిదేళ్లలో నమోదు చేసుకున్న అభివృద్ధి కన్నా తక్కువగా ఉండొచ్చని నాస్కామ్ అంచనా వేసింది. ఆటోమేషన్తోపాటు క్లైంట్లు కొత్త రంగాలకు మారడం, సంప్రదాయేతర పద్ధతుల్లో ఐటి సేవలు తదితరమైన కారణాల వల్ల ఐటి రంగంలో వృద్ధిరేటు మందగించవచ్చని నాస్కామ్ పేర్కొంది.
న్యూఢిల్లీ, జూలై 4: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్).. ముకేశ్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్పై మంగళవారం విరుచుకుపడింది. దేశీయ టెలికామ్ రంగం సంక్షోభంలో చిక్కుకోవడానికి జియోనే కారణమంటూ మండిపడింది. నిరుడు సెప్టెంబర్లో దేశీయ టెలికామ్ రంగంలో సంచలనం సృష్టిస్తూ 4జి సేవలను జియో ఆరంభించినది తెలిసిందే.
న్యూఢిల్లీ, జూలై 3: దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అమల్లోకి రావడంతో దాని ప్రయోజనాలను వాహన వినియోగదారులకు అందిస్తున్నాయి ఆటో రంగ సంస్థలు. ఒక్కొక్కటిగా ధరల తగ్గింపును ప్రకటిస్తున్నాయి. శనివారం మారుతి, టొయోట, జెఎల్ఆర్, బిఎమ్డబ్ల్యు తమ కార్ల ధరలను తగ్గించగా, ఆదివారం హీరో మోటోకార్ప్ తమ బైక్ల ధరలను దించింది.
న్యూఢిల్లీ, జూలై 3: భారతీయ మార్కెట్లో తమ స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్లు తైవాన్కు చెందిన ఆసస్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ ఐఫోన్ ధరలను తగ్గించగా, ఇప్పుడు ఆసస్ తమ జెన్ఫోన్ శ్రేణి స్మార్ట్ఫోన్ల ధరను 3,000 రూపాయల వరకు తగ్గించింది. దీంతో జెన్ఫోన్ 3 (5.5) ధర 16,999 రూపాయలు, జెన్ఫోన్ 3 మ్యాక్స్ 5.5 ధర 14,999 రూపాయలకు దిగివచ్చాయ.