-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
గుంతకల్లు, అక్టోబర్ 1: పట్టణంలోని బస్టాండ్ సమీపం వద్ద ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న మూడు నెలల చిన్నారి మృతి చెందాడు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లనే తన కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకుంది. ఈ సంఘటనకు సంబందించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
జగిత్యాల, అక్టోబర్ 1: రోజురోజుకు సినిమాల ప్రభావంతో యువత పెడదారి పడుతోందని, ఆర్ ఎక్స్ 100 సినిమా తరహాలో ఆదివారం జగిత్యాలలో ఇద్దరు విద్యార్థులు ఆత్మాహుతి చేసుకున్నారని జగిత్యాల డీఎస్పీ ఎం. వెంకటరమణ వెల్లడించారు.
నంద్యాల రూరల్, సెప్టెంబర్ 30 : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కర్నూలు జిల్లాలో మరొకరు ప్రాణాలు వదిలారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడగా ఈ నెలలోనే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఒక విద్యార్థి ప్రాణాలర్పించిన విషయం తెలిసిందే.
దేవరపల్లి, సెప్టెంబర్ 30: విజయ్ దేవరకొండ హీరోగా, ప్రియాంక హీరోయిన్గా నటించిన టాక్సీవాలా సినీమాలో కొంతమంది టెక్నీషియన్స్ కొన్ని సన్నివేశాలను బయటకు విడుదల చేశారని, దీనివల్ల ఆ సినిమా రిలీజ్ కాకుండానే పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, యర్నగూడెం పరిసర ప్రాంతాల్లో మొబైల్స్లో హల్చల్ చేశాయని ఆ సినీ నిర్మాత జి శ్రీనివాస కుమార్ నాయుడు దేవరపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పాన్గల్, సెప్టెంబర్30: బీమా కాల్వలో పడి బాలుడు గల్లంతయిన సంఘటన పాన్గల్ మండల పరిధిలోని చింతకుంట గ్రామ శివారులో జరిగింది. ఎస్ఐ తిరుపాజి తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన తిరుపతయ్య, సుజాత దంపతుల రెండవ కుమారుడు నిఖిల్కుమార్(5) అనే బాలుడు కాల్వలో పడి గల్లతయినట్లు తెలిపారు.
మోర్తాడ్, సెప్టెంబర్ 30: ఏర్గట్ల శివార్లలో రేణుక అనే వివాహిత యువతి గల్లంతైందని ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఎస్ఐ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంవత్సరాల క్రితం ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన రేణుకను, బాల్కొండకు చెందిన మారుతికి ఇచ్చి వివాహం చేసినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం తల్లిగారి ఇంటికి వచ్చిన రేణుకను భర్త తీసుకెళ్లేందుకు రాగా, ఇంట్లో చిన్న గొడవ అయినట్లు తెలిపారు.
గచ్చిబౌలి, సెప్టెంబర్ 30: ప్రేమించి పెళ్లి చేసుకుని ఆరు నెలలైనా గడవకుండానే అత్తమామల వేధింపులకు నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలి బంధువులు, పోలీసులు కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన పసుపులేటి మురళీకృష్ణ కుమార్తె రూపిణి (25) అదే ప్రాంతానికి చెందిన సందీప్రాజ్ను గత మార్చి 4న ప్రేమించి వివాహం చేసుకున్నారు.
కాచిగూడ/అల్వాల్, సెప్టెంబర్ 30: సికింద్రాబాద్ మారేడ్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ చా టింగ్ ఇద్దరిని బలిగొన్న సంఘటన మారేడ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేడ్పల్లి వాల్మీకి నగర్కు చెందిన శివ కుమార్ను యువతితో ఎందుకు వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నావని భార్య నిలదీసింది.
గుర్రంపోడు, సెప్టెంబర్ 30: మంత్రాల నెపంతో వృద్ధుడు దారుణ హత్యకు గరైన సంఘటన మండలంలోని తేనేపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై క్రాంతికుమార్ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివార్ల లింగయ్య (65) మంత్రాలు చేస్తున్నాడని ఇదే గ్రామాన్నికి చెందిన కోట్ర అనిల్ కత్తితో వెనుకబాగం నుండి పొడిచి ఆ తరువాత గొంతు కోశాడు.అక్కడికి అక్కడే మృతి చెందాడు.
మధురవాడ, సెప్టెంబర్ 30: పోతినమల్లయ్యపాలేం పోలీస్ స్టేషన్ పరిధిలోని రుషికొండ బీచ్లో మధురవాడ గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్ధులు గల్లంతవగా వారిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా ఇద్దరు మృతిచెందారు.